టాలీవుడ్ లో స్టార్ సెలబ్రెటీలు గా రాణిస్తున్న చాలామంది నిజజీవితంలో ఎన్నో ఆశ్చర్యకరమైన సంఘటన జరుగుతాయి. అవి బయటకు వచ్చినప్పుడు అభిమానులు కూడా షాక్ అవుతూ ఉంటారు. అలా ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ తో దూసుకుపోయిన ఓ ముద్దుగుమ్మ రాఖీ కట్టి అన్నయ్య అని పిలిచినా ఓ వ్యక్తితోనే ప్రేమాయణం నడిపి అతనిని సెకండ్ మ్యారేజ్ చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో.. అసలు ఆమె కథ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. దివంగత అతిలోకసుందరి శ్రీదేవికి పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిసిగా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు 1969 లో కోలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీదేవి.. తన నటనతో ఆడియన్స్ను కట్టిపడేసింది. 1971లో ఉత్తమ బాలనాటిగా కేరళ నుంచి అవార్డు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.
నార్త్లోను చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి అక్కడ కూడా ప్రశంసలు దక్కించుకుంది. అలా తర్వాత హీరోయిన్గా అవకాశాన్ని దక్కించుకుంది. ఎన్టీఆర్, నాగేశ్వరావు, కృష్ణ లాంటి దిగ్గజ నటులతోను అమ్మడు ఆడి పాడింది. తనదైన అద్భుత నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. దుబాయ్ కి బంధువుల పెళ్ళికి వెళ్లి ప్రమాదవశాత్తు అక్కడ బాత్ టబ్ లో పడి మరణించింది. శ్రీదేవి మరణ వార్తతో అభిమానులంతా శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే శ్రీదేవి బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనికపూర్ను శ్రీదేవి రెండో వివాహం చేసుకొని అందరికీ షాక్ ఇచ్చింది. కోలీవుడ్లో శ్రీదేవి హీరోయిన్గా నటించిన సమయంలో ఆమెను చూసిన బోనీకపూర్ ఆమెను ప్రేమించాడు. ఆమెతో మిస్టర్ ఇండియా సినిమాలో ఓ పాత్ర కోసం బోనీ కపూర్ను మేకర్స్ సంప్రదించారు.
అయితే ఆ టైంకి బోనికపూర్కు ఇంకా పెళ్లి కాలేదు. శ్రీదేవి మాత్రం మిధున్ చక్రవర్తితో డేటింగ్ లో ఉండేది. ఇక ఆ సినిమా షూట్ టైంలో మిధున్ చక్రవర్తి.. శ్రీదేవికి వివాహం జరిగిందని కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి. అయితే శ్రీదేవి ఎక్కువ కాలం మిధున్ చక్రవర్తితో రిలేషన్ కొనసాగించలేకపోయింది. అయితే ఆ సమయంలో బోనీకపూర్కు మోనాతో వివాహం జరగడం.. ఈ జంటకు అర్జున్, అన్షుల కప్పుర్ జన్మించడం జరిగింది. దాదాపు 13 సంవత్సరాలు పాటు వివాహ జీవితంలో సంతోషంగా ఉన్న బోనికపూర్కు.. ఏడేళ్ల తర్వాత మోనతో ఉన్న స్నేహంతో శ్రీదేవి దగ్గర అయింది. అలా బోనికపూర్ను అన్నయ్య అంటూ ఆయనకు రాఖీ కూడా కట్టింది. అయితే ఆ సమయంలో శ్రీదేవి తల్లి చేసిన అప్పులను బోనికపూర్ మాఫీ చేయడంతో.. శ్రీదేవి అతనికి మరింత దగ్గర అయింది. అలా ఒకరికొకరు వివాహం చేసుకోక ముందే దగ్గర అవడంతో.. శ్రీదేవి గర్భం దాల్చింది. ఆ విషయం మోనాకు తెలియడంతో మోనాకు విడాకులు ఇచ్చింది. అలా మొదట అన్నయ్య అంటూ బోణి కపూర్ను పిలిచిన శ్రీదేవి.. అతనితోనే ప్రేమలో పడి పెళ్లికి ముందే గర్భం దాల్చి.. జాన్వీ కపూర్ కు జన్మనిచ్చింది. తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకుని ఖుషి కపూర్ కు జన్మనిచ్చారు.