ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గురించి దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నందమూరి వారసుడు కళ్యాణ్రామ్ హీరో గానే కాదు.. ప్రొడ్యూసర్ గాను ఎన్నో సినిమాలకు వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తన తాత, నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు పేరిట సొంత బ్యానర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ప్రొడక్షన్ హౌస్ ద్వారా సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ లాంటి ఎంతోమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అయితే ఎన్నో ఆశలు పెట్టుకొని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన కళ్యాణ్ రామ్.. ఈ బ్యానర్ స్థాపించిన తర్వాత ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.
ఇక ఈ బ్యానర్ లో మొదట కళ్యాణ్ రామ్ హీరోగా వరుస సినిమాలు తెరకెక్కి అన్ని ఫ్లాప్స్గా నిలవడంతో అయినా పీకల్లోతు నష్టాల్లో మునిగిపోయాడు. వాటిలో ఈయన నటించిన జయిభవ, కత్తి, ఓం త్రిడి, హరే రామ్, ఇజం సినిమాలు ఉన్నాయి. ఈ ఐదు సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో ఎన్టీఆర్ బ్యానర్ దాదాపు మూసివేయాలని కళ్యాణ్ రామ్ భావించాడట. అలాంటి పరిస్థితి నెలకొన్న క్రమంలో అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ను అప్రోచ్ చెయ్ పటాస్ కథను వినిపించడం.. వారికి నచ్చడంతో పటాస్ సినిమాను మాత్రం ఎలాగులా తరికెక్కించారు. అయితే ఈ సినిమా కళ్యాణ్ రామ్కు కాస్త ఊరట ఇచ్చింది. అయితే అప్పటికి బ్యానర్లో సినిమాల కారణంగా పీకల్లోతున్న నష్టాల్లో మునిగిపోయిన కళ్యాణ్ రామ్కు తమ్ముడు ఎన్టీఆర్ సపోర్ట్.. అందటం మరింత ప్లస్ అయ్యింది.
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సినిమా జై లవకుశ ఇండస్ట్రీలో ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన ఈ సినిమాను నిర్మించే అవకాశాన్ని అన్న కళ్యాణ్ రామ్కు ఇచ్చాడు తారక్. అదేవిధంగా ఆయన ఇటీవల చేసిన దేవర కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో కలెక్షన్లు రాబట్టి కళ్యాణ్ రామ్ లాభాల బాటలోకి మెల్లగా అడుగు పెట్టాడు. అలా దాదాపు కష్టాల బాటలో మునిగిపోయిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ను లాభాల బాట పట్టించడానికి ఎన్టీఆర్ ప్రత్యక్షంగా అన్నకు ఎంతో సపోర్ట్ గా నిలిచాడు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ మద్య ఎంత సన్నిహిత్యం ఉందో దీనిని బట్టి అర్థమవుతుంది. కాగా పాన్ ఇండియన్ స్టార్ హీరోగా వరుస సినిమాలను లైన్లో పెట్టుకుంటూ బిజీబిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో వార్2 సినిమా షూట్లో ఉన్నాడు. ఇక తారకి సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో మరో సినిమాలో నటించనున్నాడు. అయితే ఈ సినిమా కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పైన రానున్నట్లు సమాచారం.