టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఎన్నో క్రేజీ మల్టీస్టారర్లు వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి. మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ వచ్చాయి. ఇక ఫ్యాన్స్ కోరుకునే ఎంతమంది స్టార్ సెలబ్రిటీల మల్టీ స్టారర్ సినిమాలు పెండింగ్ లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే దర్శకులు వాటిని తీసే పనిలో బిజీగా ఉన్నారు. అలాంటి వాటిలో మహేష్ – పవన్ కాంబోలో మల్టీస్టారర్ వస్తే బాగుంటుందని అభిమానులు ఎప్పటినుంచో ఆశ పడుతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి కాంబోలో నిజంగానే అనుకున్నట్టు సినిమా వస్తే.. బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాయం అనడంలో సందేహం లేదు.
కానీ.. ఇప్పట్లో ఆ పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే వీరిద్దరి వారసులుగా ఆకీరా నందన్, గౌతమ్ కృష్ణ కాంబోలో మల్టీ స్టారర్ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇక వీరిద్దరి కాంబోలో మల్టీస్టారర్ అంటే ఫ్యాన్స్కు పెద్ద పండగ అనడంలో సందేహం లేదు. ఆకీరా, గౌతమ్ లు తొందరలోనే హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారని టాక్. అటు అకీరా.. ఇప్పటికే ప్రాక్టీస్ ప్రారంభించేసాడు. యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక గౌతమ్ కృష్ణ ప్రస్తుతం ఫారెన్లో తన చదువును పూర్తి చేస్తున్నాడు. అతను కూడా చదువును పూర్తి చేసి వెంటనే నటన రంగంలోనికి అడుగుపెట్టే అవకాశం ఉందట. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు వారసులతో ఓ మల్టీస్టారర్ సినిమా చేయాలని చూస్తున్నారట.
ఒకే ఒక సినిమాతో వీరిద్దరి లాంచ్ ఉండాలని.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు గానీ.. ప్రస్తుతం ఇది వైరల్ అవడంతో త్రివిక్రమ్ ఇద్దరికీ మంచి సన్నిహితుడు కనుక.. ఆయన అనుకుంటే ఇది కచ్చితంగా సాధ్యమవుతుంది అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఇక ఈ వారసుల ఎంట్రీ పై ఫ్యాన్స్ ఎప్పటినుంచి ఈగర్గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఇద్దరు వారసులు ఒకే సినిమాతో లాంచ్ అయితే.. ఆడియన్స్ అంచనాలకు హద్దులే ఉండవు. మరీ త్రివిక్రమ్ అంచనాలను అందుకుంటాడా..? లేదా..? అసలు వీరిద్దరు కాంబోలో సినిమా తెరకెక్కుతుందా..? రూమస్ తోనే ఆగిపోతుందో..? తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.