టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఆడియన్స్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్ది.. యంగ్ లుక్తో మెస్మరైజ్ చేస్తున్న మహేష్.. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్లో పాన్ వరల్డ్ సినిమాలో నటించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పటికప్పుడు తన డైట్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ.. తన లుక్ను మెయింటైన్ చేస్తున్న మహేష్.. తాజాగా విదేశాలకు వెళ్ళగా.. దానికి సంబంధించిన వీడియోస్, ఫొటోస్ నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి.
ఈ క్రమంలో మహేష్ బాబు ధరించిన బ్యాగ్ ప్యాక్ కాస్ట్ వైరల్గా మారింది. మహేష్ ధరించిన ఈ సింపుల్ బ్యాగ్ ఖరీదు తెలిస్తే ఫీజులు ఎగిరిపోతాయి అంటూ.. కాస్ట్ తెగ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆ బ్యాగ్ ఖరీదు చెప్పలేదు కదా.. ఏకంగా రూ.3,81,841 అట. లగ్జరీ లూయిస్ వెటర్న్ క్రీఫ్టో ఫర్ ఎం ఎం బ్రాండెడ్ బ్యాగ్ ప్యాక్ ను మహేష్ బాబు ధరించి విదేశాలకు వెళ్లారు. అయితే మహేష్ బాబు.. నమ్రత, సితారతో కలిసి ఏ దేశానికి వెళ్లారని చర్చ కూడా హాట్ టాపిక్ గా మారింది.
మరో పక్క జక్కన్న – మహేష్ కాంబో మూవీ 2025 జనవరిలో ప్రారంభం కానుందని విజయేంద్రప్రసాద్.. తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేశారు. వీళ కాంబోలో మూవీ.. బడ్జెట్ భారీ స్థాయిలో ఉండబోతుందని.. మహేష్, రాజమౌళి స్థాయిలను మరింతగా పెంచే విధంగా.. టాలీవుడ్ ఖ్యాతిని రెట్టింపు చేసే విధంగా సినిమా తెరకెక్కనిందని టాక్. ఇక ఈ సినిమా సక్సెస్ తర్వాత మహేష్ బాబు నెక్స్ట్ సినిమాలో ప్లానింగ్ ఎలా ఉండనుందో వేచి చూడాలి. మహేష్కు సోషల్ మీడియాలో సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో మహేష్ ఫ్యూచర్లో మరిన్ని సినిమాలు నటించే రికార్డ్ స్థాయిలో సక్సెస్లు అందుకోవాలంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.