నందమూరి నటసింహం.. టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరిస్తున్న అన్స్టాపబుల్ విత్ ఎన్బికె.. షోకు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో ఇప్పటికే స్ట్రీమ్ అయిన మూడు సీజన్లు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో బాలయ్య నెక్స్ట్ సీజన్ పై ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ పెరిగింది. ఇప్పటికే మూడు సీజన్ లో రాజకీయ ప్రముఖుల నుంచి.. సినీ ప్రముఖుల వరకు.. ఎంతో మంది హాజరై సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అన్స్టాపబుల్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు నాలుగోవ సీజన్తో బాలయ్య ఆడియన్స్ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక బాలయ్య అన్స్టాపబుల్ 4 ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 24 నుంచి టెలికాస్ట్ చేయనున్నట్టు నిర్వాహకులు అనౌన్స్ చేశారు.
కాగా ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్గా రాబోతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు పుష్ప 2హొల్ టీం సందడి చేయనున్నారట. త్వరలోనే పుష్ప సీక్వెల్ రిలీజ్ కానున్న క్రమంలో.. పుష్ప 2 టీం అంతా వచ్చి సందడి చేయనున్నట్లు సమాచారం. త్వరలో ఈ ఎపిసోడ్ షూటింగ్ కూడా జరగనుందట. ఆ తర్వాత ప్రోమో రిలీజ్ చేసి సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే బాలయ్య ఫస్ట్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ అంత తెగ ఎదురు చూస్తున్నారు. కాగా.. బాలయ్య , ఐకాన్ స్టార్ ఇంటర్వ్యూలో నంద్యాల ఎపిసోడ్ ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార టైం లో నంద్యాల వైసిపి అభ్యర్థి ఆయన ఫ్రెండ్ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన సంగతి తెలిసిందే.
పవన్ కు మద్దతుగా ట్విట్ చేసి.. శిల్పారావి ఇంటికి వెళ్లి మరీ విష్ చేయడం మెగా అభిమానులు అసలు సహించలేకపోయారు. అప్పటినుంచి మెగా, అల్లు కుటుంబాల మధ్యన కోల్డ్ వార్ జరుగుతుందని అందరికీ తెలిసిందే. ఈ విషయంపై బన్నీతో బాలయ్య ప్రస్తావించనున్నారని.. ఆ గొడవ పై ఒక క్లారిటీ రానుందని సమాచారం. ఇప్పటికే ఎంతోమంది అభిమానులు కూడా ఆ నంద్యాల ఎపిసోడ్ను క్లోజ్ చేయాలంటూ.. బాలయ్య దీనిని సెటిల్ చేయాలంటూ.. అన్స్టాపబుల్4 దానికి పర్ఫెక్ట్ వేదికంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరి అల్లుఅర్జున్ నిజంగానే ఈ ఎపిసోడ్లో పాల్గొంటాడా లేదా.. ఈ వివాదంపై ఎలాంటి క్లారిటీ రానుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.