టాలీవుడ్ పాపులర్ డ్యాన్సర్, నటి, ఐటెం గర్ల్స్ డిస్కో శాంతికి టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చిరంజీవితో పాటు ఎంతో మంది స్టార్ హీరోల సరసన చిందేసిన ఈ ముద్దుగుమ్మ.. 1996లో టాలీవుడ్ స్టార్ హీరో.. రియల్ స్టార్ శ్రీహరిని వివాహం చేసుకొని ఇండస్ట్రీకి దూరమైంది. ఇక ఈ జంటకు ముగ్గురు పిల్లలు. దురదృష్టవశాత్తు శ్రీహరి 2013లో అనారోగ్యంతో కన్నుమూశారు. ఇక శ్రీహరి పెద్ద కొడుకు గతంలో హీరోగా ప్రయత్నం చేసిన అది సక్సస్ కాలేదు. ఈ క్రమంలో ఇటీవల డిస్కో శాంతి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. సిల్క్ స్మీతతో తనకున్న బాండింగ్ గురించి మాట్లాడుతూ.. స్మిత లగ్జరీ లైఫ్ ఎలా ఉండేదో వెల్లడించింది. చాలా మంచిది.. చనువుగా మాట్లాడేది.. నేను అక్క అంటూ ఆమెను పిలిచే దాన్ని.. తన భర్త గురించి, అతని రెండో పెళ్లి, పిల్లల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉండేది.. నాతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకునేది అంటూ డిస్కో శాంతి వివరించింది.
ఆ రోజుల్లోనే రోజుకి ఏకంగా లక్ష నుంచి మూడు లక్షలు సంపాదించేది. మేము ఆ స్థాయికి రావడానికి ఏకంగా పదేళ్లు పట్టింది. ఇక అప్పట్లో ఏకంగా నెలకు రూ.5 లక్షల చెల్లించి అద్దె ఇంట్లో ఉండేది. సొంత ఇల్లు కొనుక్కోవచ్చుగా అంటే.. వినేది కాదు. ఇక నోట్ల కట్లపై తాను పడుకునేదని.. అవకాశాల కోసం నేను తిరిగేటప్పుడు.. ఎవరు నన్ను ఆదరించలేదు. అందుకే ఇప్పుడు నోట్లో కట్టలపై పడుకుంటా అనేదని వెల్లడించింది. అందరూ ఆమెను చాలా గౌరవించే వారిని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఏలూరు సమీపగ్రామంలో పుట్టిన స్మిత.. పెద్దగా చదువుకోలేదు ఆమె అసలు పేరు విజయలక్ష్మి. బాల్యంలోనే పెళ్లి చేయడం అత్తింటి వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయింది. తర్వాత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ తన సినిమాలతో సౌత్ ఇండియా నే ఏలింది. విలన్, వ్యాంప్, సపోర్టింగ్ రోల్స్ సైతం నటించి మెప్పించింది.
లవ్ ఫెయిల్యూర్ లో ఒంటరితనాన్ని భరించలేక 1996లో ఆత్మహత్య చేసుకుంది. తిరుగులేని స్టార్డం అయిన సంపాదించుకున్న స్మిత.. చివరకు గవర్నమెంట్ ఆసుపత్రిలో అనాధ శవంగా మిగిలింది. ఈమె అంత్యక్రియలకు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు వెళ్లలేదు. కేవలం అర్జున్ సర్జా మాత్రమే ఇచ్చిన మాట ప్రకారం ఆమె అంత్యక్రియలకు హాజరైనట్లు సమాచారం. ఇక కుటుంబ సభ్యులను కూడా చేరదీయకపోవడంతో వారు కూడా ఆమెను దూరం పెట్టేశారు. ఇక ఈమె జీవిత చరిత్రపై డర్టీ పిక్చర్ టైటిల్తో బాలీవుడ్లో సినిమా వచ్చి సంచలన విజయాన్ని దక్కించుకుంది. అప్పట్లో సిల్క్ స్మిత కుటుంబ సభ్యులు ఈ టైటిల్ పై అభ్యంతరం తెలియజేశారు. కొంత వివాదం నడిచిన తర్వాత.. అది సద్దుమణిగింది. ఇంకా ఈమె బ్రతికి ఉంటే అప్పట్లోనే ఎన్నో సంచలనాలు సృష్టించేది. నోట్ల కట్టాలపై పడుకున్న ఈ నటి చివరకు అనాధల లోకాన్ని విడిచింది.