కన్నడ రీమేక్ సప్తసాగరాలు దాటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది హీరోయిన్ రుక్మిణి వసంత్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తాజాగా నటించిన కన్నడ మూవీ భఘీర. దీపావళికి రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన రుక్మిణ్.. తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. చిన్నప్పటి నుంచి తాను ఎంతో యాక్టివ్ గా ఉండే దానినని.. 13 ఏళ్ల వయసులోనే స్టేజ్ ఆర్టిస్ట్ అయ్యా.. ఎంతో మంది ప్రశంసలు దక్కించుకున్న. ఎప్పటికీ అది మర్చిపోలేను. ఆ ప్రశంసలే నా లైఫ్ పై ప్రభావం చూపాయి. దీంతో 15 ఏళ్లకే థియేటర్ ఆర్టిస్ట్ గా మారా అంటూ చెప్పుకొచ్చింది. లండన్ వెళ్లి రాయల్ అకాడమీ డ్రోమాటిక్ ఆర్ట్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశానని.. తిరిగి బెంగళూరు రాగానే బీర్బల్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నట్లు చెప్పుకొచ్చింది.
అలా వెండితెరపై కెరీర్ ప్రారంభించిన రుక్మిణి వసంత్.. 2020 మార్చ్లో సప్తసాగరాలు దాటి నుంచి డైరెక్టర్ రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్టర్ను చూసి ఫీదా అయిందట. లాక్డౌన్ టైంలో ఇందులో మెయిన్ లీడ్ కోసం వివరాలు తెలియజేస్తూ డైరెక్టర్ కి ఇన్స్టా మెసేజ్ చేశానని.. 10 రోజుల తర్వాత ఆడిషన్స్ కు రమ్మని రిప్లై వచ్చిందంటూ చెప్పుకొచ్చింది. లుక్ టెస్ట్ చేసి సెలెక్ట్ చేశారని నేను ఆరోజు చేసిన ఒక్క చిన్న మెసేజ్ నాకు ఇంత మంచి సక్సెస్ ను అందించిందని.. సినిమాల్లో ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నట్లు చెప్పుకొచ్చింది. అలాగే సినిమాలకు సంబంధించిన నిన్న ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్న ఈ అమ్ముడు.. తన ఫ్యామిలీ గురించి చెప్పుకొస్తూ అమ్మ ఓ మంచి డ్యాన్సర్ అని.. నాన్న కల్నల్ అంటూ చెప్పుకొచ్చింది.
పుట్టింది బెంగళూరులో అయినా వృత్తిపరంగా వేరే ప్రాంతంలో పెరగాల్సి వచ్చిందని.. పదేళ్లు ఉన్నప్పుడే భారత్ – పాకిస్తాన్ బోర్డర్లో జరిగిన ఉగ్రదాడుల్లో నాన్న వీరమరణం చెందారంటూ చెప్పుకొచ్చింది. ఆయనకు అశోక చక్ర వచ్చిందని.. కర్ణాటక రాష్ట్రం నుంచి ఆ గౌరవాన్ని పొందిన మొదట వ్యక్తి మా నాన్నే అంటూ చెప్పుకొచ్చింది. ఇక తండ్రి దూరమైన తర్వాత బెంగళూరులో మేము సెటిల్ అయ్యాం. అప్పటినుంచి అమ్మే.. నన్ను , నా సిస్టర్ని ఏ లోటు లేకుండా పెంచింది. మాకు ఆమె సర్వస్వం అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడి బ్యాక్గ్రౌండ్ చూసి అంత షాక్ అవుతున్నారు. తన అందం, అభినయంతో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్ కు ఎంత ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉందా అంటూ.. నిజంగానే ఆమె స్టోరీ వింటే ఎమోషనల్ గా అనిపించింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.