ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా థ్రో బ్యాక్ థీంతో సెలబ్రిటీల ఓల్డ్ పిక్స్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శ్రీదేవి టీనేజ్ కు సంబంధించిన ఓ ఫోటో నెటింట తెగ వైరల్గా మారుతుంది. అందులో ఆమె పక్కన సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లుగా రాణించిన ముగ్గురు అక్క చెల్లెలు కూడా మెరిసారు. ఈ ముగ్గురు టాలీవుడ్ లోనూ నటించి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ ముగ్గురు అక్క చెల్లెలు మెగాస్టార్ సరసన నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న వాళ్లే. ఇంతకీ ఈ అక్క, చెల్లెలు ఎవరో గుర్తుపట్టారా..
ఇప్పటికే చాలామందికి వాళ్ళు ఎవరో తెలిసిపోయి ఉంటుంది. ఈ అక్క చెల్లెలు మరెవరో కాదు నగ్మా, జ్యోతిక, రోషిని. శ్రీదేవి కుడి వైపు కూర్చున్న అమ్మాయి నగ్మా. అలాగే ఎడమ వైపు జ్యోతిక, రోషిని కూర్చుని ఉన్నారు. వీరంతా ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా రాణించడమే కాదు.. మెగాస్టార్తో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఘరానా మొగుడు సినిమాలో చిరంజీవికి జంటగా నగ్మా నటించి మెప్పించింది. ఈ మూవీ తర్వాత రిక్షావాడు, ముగ్గురు మొనగాళ్లు సినిమాలోను వీళ్ళిద్దరు కలిసి నటించారు.
ఇక తర్వాత జ్యోతిక, చిరంజీవి కాంబోలో ఠాగూర్ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పాటలు మంచి సక్సెస్ అందుకున్నాయి. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా వచ్చి యూత్ను ఠాగుర్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇక మూడో చెల్లి రోషిని కూడా చిరంజీవితో కలిసి చిందేసింది. మాస్టర్ సినిమాలో రోషిని, చిరంజీవి జంటగా కనిపించి మెప్పించారు. ఇలా మొత్తం ముగ్గురు అక్క చెల్లెళ్లతో కలిసి ఆడి పాడిన ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి రికార్డు క్రియేట్ చేశాడు. అంతేకాదు ఈ ఫోటోలో ఉన్న ముగ్గురు అక్క చెల్లెళతో పాటు.. శ్రీదేవి, చిరంజీవి కాంబోలోను పలు సినిమాలు వచ్చి బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.