నందమూరి నటసింహం బాలకృష్ణ కోపిష్ అని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. బాలయ్యతో పాటు.. నటించిన ఎంతోమంది హీరోయిన్స్ తర్వాత ఆయనతో అవకాశం వస్తే వామ్మో ఆ కోపాన్ని మేము భరించలేమని సినిమాలను రిజెక్ట్ చేశారని కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆయన కూడా పలు ఈవెంట్స్ కు వెళ్లిన సందర్భాల్లో ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డ సంఘటనలు నెట్టింట ఎన్నోసార్లు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే బాలయ్యకు కోపం ఎక్కువ అంటూ కామెంట్లు వినిపిస్ఆయి. అయితే బాలకృష్ణ భోళా మనిషని.. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతారు.. ముక్కుసూటి మనిషి. ఎవరైనా తప్పు చేస్తే.. ఎదుట ఉన్నవారు ఎలాంటి వారైనా.. ఎంత పెద్ద స్టేజ్ లో ఉన్న వారిపై తన కోపాన్ని చూపిస్తాడని సన్నిహితులు చెబుతుంటారు.
అలా ఇప్పటికే ఎంతోమంది స్టార్స్ ఆయన కోపానికి బలైపోయారని టాక్. అలాంటి బాలయ్య కోపాన్ని కూతుళ్లు బ్రాహ్మణి, తేజస్విని, కొడుకు మోక్షజ్ఞ, భార్య వసుంధరలు ఇట్టే మాయం చేసేస్తారట. బాలయ్య కోపంగా వచ్చిన ఆయనను చాలా నిదానంగా హ్యాండిల్ చేస్తారట. ఒక్క చిన్న టిప్ తో ఆయన్ను వెంటనే కూల్ చేస్తారట. బాలయ్య ఏదైనా పనిలో ఉన్నా.. లేదంటే ఎవరితోనైనా మాట్లాడుతున్న సందర్భంలో ఆయనను డిస్టర్బ్ చేస్తే విపరీతమైన కోపం వచ్చేస్తుందట.
అలా ఇప్పటికే చాలాసార్లు పిల్లలపై బాలయ్యకు విపరీతమైన కోపం వచ్చిన సందర్భాలు ఉన్నాయని.. అయితే వారిపై తండ్రికి కోపం వచ్చినప్పుడు.. భార్య, పిల్లలు లో ఎవరైనా సరే ఆయన మాటలకు ఎదురు చెప్పకుండా అసలు మారు మాట్లాడకుండా ఎవరి రూమ్ లోకి వారు వెళ్ళిపోయి సైలెంట్ గా ఉండిపోతారట. అలా కొద్దిసేపటికి బాలయ్య కోపం తగ్గి ఆయన వెళ్లి వారితో మాట్లాడతారట. అదే నందమూరి ఫ్యామిలీ ట్రిక్ అని కూడా టాక్ ఉంది. అంతే కాదు.. బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ తన తండ్రి మాటలకు ఎలాంటి విలువ ఇస్తారో అందరికీ తెలుసు. వారికి పెళ్ళై పిల్లలు ఉన్నా ఇప్పటికీ తండ్రి మాట కాదనకుండా బ్రాహ్మణి, తేజస్విని ఆయన మాటలపై ఎంతో గౌరవంగా ఉంటారు. ఇక మోక్షజ్ఞ కూడా తండ్రి మాటను జవదాటడు.