మోక్షజ్ఞకు జంటగా ఆ హీరోయిన్లు కాదా.. ఈ బాలీవుడ్ బ్యూటీ ఛాన్స్ కొట్టేసిందా.. ?

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ కోసం కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసిన‌ నందమూరి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో హనుమాన్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసిన ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోనే ఈ సినిమా రూపొందించడం.. అది కూడా బాలయ్య తనయుడు హీరోగా ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మొదటి నుంచి మంచి అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా టైటిల్ పెట్టడంగాని.. రెగ్యులర్ షూటింగ్ గాని.. ఇంకా మొదలుకాకముందే ఆడియన్స్‌లో మంచి హైప్‌ నెలకొంది.

Prasanth Varma is all set to do multi starrer with Mokshagna Teja and other  Nandamuri heroes | Mokshagna Teja: మోక్షజ్ఞ‌తో ప్రశాంత్ వర్మ మూవీ -  అంతేకాదు, మరో బిగ్ సర్‌ప్రైజ్ కూడా ఉందట!

ఈ క్రమంలోనే సినిమా కాస్టింగ్‌కు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇక తాజాగా మోక్షజ్ఞ పక్కన హీరోయిన్గా బాలీవుడ్ నటి ర‌షా త‌దాని నటించనుందంటూ సమాచారం. గతంలో ఈ అమ్మ‌డును రామ్ చరణ్ 16 కోసం ట్రై చేసి ఫోటోషూట్ కూడా చేశారట. కానీ.. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఫైనల్ గా జాన్వి కపూర్‌ని ఆ సినిమాకు లాక్ చేసి అఫీషియల్‌గా ప్రకటించారు. అయితే ఈ రషా త‌దాన్ని బ్యాగ్రౌండ్ ఏంటో ఆమె ఎవరో ఎక‌సారి చూద్దాం. ర‌షా త‌దాని ఎవ‌రోకాదు బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ కూతురు. 1993లో బంగారు బుల్లోడు సినిమాతో బాలకృష్ణ సరసన.. రమ్యకృష్ణ తో పాటు రవీనా కూడా నటించి మెప్పించింది. అది బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అయినా టాలీవుడ్ లో మరే సినిమాలు నటించకుండా బాలీవుడ్ వైపు వెళ్లి అక్కడే సినిమాలతో బిజీ అయింది.

కొంత గ్యాప్ తర్వాత మరోసారి నాగార్జున నటించిన ఆకాశ వీధిలో సినిమాలో నటించింది. ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇక చివ‌రిగా మంచు ఫ్యామిలీ తీసిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాల్లో మెరిసిన ఈ ముద్దుగుమ్మ.. కన్నడ కేజిఎఫ్ లో ఓ కీల‌క పాత్రలో కనిపించింది. ఇక టాలీవుడ్‌తో ఈ రేంజ్‌లో కనెక్షన్ ఉన్న రవీనా.. తన కూతుర్ని సౌత్ లో లాంచ్ చేయాలనుకుంటుంది. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ కన్నా అమ్మడి ఎంట్రీ కి గ్రాండ్ ఆప్షన్ వేరే ఉండదు అనడంలో సందేహం లేదు. అయితే ఈ వార్తపై మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేవరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని.. ప్రశాంత్ వర్మ ఈ క్రమంలోనే ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో 2026 లో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేసుకుంటున్నారట.