సీనియర్ యాక్టర్ రోహిణి కాళ్లు పట్టుకున్న ఏఎన్ఆర్.. కారణం ఏంటంటే..?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ రోహిణికి తెలుగు ఆడియన‌స్‌లో ప్ర‌త్యేక పరిచయం అవసరం లేదు. బాలనటిగా సినీ కెరీర్‌ ప్రారంభించిన ఈ అమ్మడు.. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, యాంకర్‌గా, సామాజిక కార్యకర్తగా, రైటర్‌గా, మల్టీ టాలెంటెడ్ స్టార్ బ్యూటీ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. మొదటి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించింది. తర్వాత మలయాళ సినిమాతో న‌టిగా కెరీర్‌ను ప్రారంభించి తెలుగు, తమిళంలోనూ హీరోయిన్గా నటించింది. ఈ క్రమంలోనే నటుడు రఘువరన్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకున్న రోహిణి.. వివాదాల కారణంగా ఏడు సంవత్సరాల కాపురం తర్వాత విడాకులు ఇచ్చింది.

Rohini pens a heartfelt note on Raghuvaran's remembrance day

ఇక అనకాపల్లి, విశాఖపట్నంలో జన్మించిన రోహిణి తండ్రికి కూడా.. నటనపై స్వతహాగా ఆసక్తి ఉండడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. రోహిణి తల్లి సరస్వతి నాలుగేళ్ల వయసులోనే మరణించడంతో మొత్తం ఫ్యామిలీ అంతా మాక్కం చెన్నైకి మార్చేశారు. ఇక సినిమాలపై తండ్రికి ఉన్న ఆసక్తితో స్టూడియోలచుట్టూ తిరుగుతూ.. రోహిణిని కూడా తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే యశోద కృష్ణ సినిమాలో బాలనట్టుగా రోహిణికి అవకాశం వచ్చింది. అలా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె.. తెలుగు, తమిళ్ సినిమాల్లోనూ ప్రేక్షకులను మెప్పించింది. ఇక తెలుగులో నాలుగు స్తంభాల ఆట సినిమాకు రోహిణి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరించింది.

ఇక హీరోయిన్ విజయశాంతికి తప్ప.. అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల‌ అందరికీ ఈమె డబ్బింగ్ చెప్పేదట. ఇక తెలుగులో రోహిణి స్త్రీ మూవీలో హీరోయిన్గా నటించి మెప్పించింది. ఈమూవీలో అమ్మ‌డి న‌ట‌నకుగాను ఏపీ ప్రభుత్వం 1996లో ఉత్తమ మహిళా నటి అవార్డును సత్కరించారు. అదే సమయంలో ఏఎన్ఆర్ తో జరిగిన ఒక తమాషా సంఘటన గురించి తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది రోహిణి. అక్కినేని నాగేశ్వరావు నటించిన మహాకవి క్షత్రియ సినిమాల్లో.. ఏఎన్ఆర్ గారు ఓ సందర్భంలో నా కాళ్లు పట్టుకునే సీన్ వచ్చిందని.. ఆ సీన్ చేసేటప్పుడు ఆయన నాతో నేను ఎంత పెద్ద నటుడునో తెలుసా.. నాతో కాళ్లు పట్టించుకుంటున్నావ్ అని ఫన్నీ కామెంట్స్ చేశారని.. అయితే వాస్తవానికి అప్పటికే అక్కినేని గారు ఎంత పెద్దనటుడో నాకు తెలియదని.. దాంతో మీరు ఎవరో కూడా నాకు తెలియదని చెప్పానని.. వెంటనే ఏఎన్ఆర్ గారు పక్కున నవ్వేశారు అంటూ అప్పటి జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుంది రోహిణి. ప్రస్తుతం రోహిణి చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవుతున్నాయి.