గతంలో టాలీవుడ్ మూవీ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైంది. కానీ.. ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి పాన్ ఇండియా లెవెల్లో వ్యాపించిన సంగతి తెలిసిందే. బాహుబలి తో పాన్ ఇండియా లెవెల్ లో టాలీవుడ్ సినిమాలు మొదలయ్యాయి. తర్వాత చిన్న, పెద్ద హీరోలని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే బాహుబలి, పుష్ప, సాహో, ఆది పురుష్, కల్కీ, హనుమాన్, కార్తికేయ 2, ఆర్ఆర్ఆర్ ఇలా ఎన్నో సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాయి.
రోజురోజుకు తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచుతున్నాయి. బాలీవుడ్ హీరోలు కూడా టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమాలు చేయడానికి ఎదురుచూసే రేంజ్కు టాలీవుడ్ ఎదిగింది. ఇప్పటికే పలువురు హీరోలు తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసి సక్సెస్ అందుకుంటున్నారు కూడా. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. మహేష్ బాబు డైరెక్టర్ తో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో కాదు వంశీ పైడిపల్లి.
టాలీవుడ్ లో మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలకు మహర్షితో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన వంశీ.. తాజాగా అమీర్ ఖాన్ కు ఒక కథ వినిపించారట. ఆ లైన్ నచ్చడంతో వెంటనే అమీర్ ఖాన్ కూడా లైను డెవలప్ చేసుకుని తీసుకురమ్మని వివరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వంశీ ఆ పనిలోనే బిజీగా ఉన్నాడని ఫిలిం వర్గాల టాక్ . ఇక మొదటి నుంచి అమీర్ ఖాన్ కు సౌత్ డైరెక్టర్లతో పనిచేయాలని ఆసక్తి ఉంది. గతంలో మురగదాస్తో గజినీ సినిమాలో నటించాడు. ఇప్పుడు వంశీ పైడిపల్లి కి కూడా అమీర్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తుంది. ఇక సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడట.