ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్లుగా సత్తా చాటమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇక అందులోను తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా రాణించడం అంటే మరీ కష్టం. ఇప్పుడిప్పుడే కొందరు తెలుగు అమ్మాయిలు కూడా వెండితెరపై సత్తా చాటాడానికి ముందుకు వస్తున్నారు. అందులో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకటి. పై ఫోటోలో అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఓ మంచి పనితో నెటిజన్ల‌ ప్రశంసలు కూడా దక్కించుకుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ఆమె అనన్య నాగళ్ల‌. తెలంగాణ ఖమ్మం జిల్లా.. సత్తెనపల్లిలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ హైదరాబాదులో బీటెక్నిక్ కంప్లీట్ చేసుకుంది.

TOP 10 Controversies of Ananya Nagalla (Vakeel Saab, Mallesham Actress) -  Film Entertainment Forum

కొంతకాలం ఇన్ఫోసిస్ లో సాఫ్ట్వేర్ గా పనిచేసిన ఈ అమ్మ‌డు.. ఓవైపు జాబ్ చేస్తూనే.. మరోవైపు నటనపై ఆసక్తితో ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. మొదట్లో షార్ట్ ఫిలింస్‌ చేసి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనన్య.. షాది షార్ట్ ఫిలింతో ఉత్తమ నటిగా సైమ అవార్డును ద‌క్కించుకుంది. తర్వాత యంగ్ హీరో ప్రియదర్శి మల్లేశం సినిమాలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ప్లే బ్యాక్ సినిమాల్లో నటించిన ఊహించిన సక్సెస్ రాలేదు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన వకీల్ సాబ్ సినిమాల తన నటనతో ఆకట్టుకుంది. ఈ మూవీతో అనన్యకు భారీ పాపులారిటీ వచ్చింది. వ‌కీల్ సాబ్‌ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. మాస్ట్రో, ఊర్వశివో రాక్షసివో ఇలా ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలో మెప్పించింది.

Tollywood: ఇండస్ట్రీలో సత్తా చాటుతోన్న అచ్చమైన తెలుగమ్మాయి.. ఈ చిన్నారి  ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..? - Telugu News | Guess the  Actress in this ...

ఇప్పుడిప్పుడే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం ఇన్స్టాలో 1.5 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకున్న ఈ అమ్మడు.. అటు సినిమాలతో పాటు ఇటు వెబ్ సిరీస్లలోనూ బిజీబిజీగా గడుపుతుంది. అంతేకాదు తాజాగా వచ్చిన అధిక వర్షాల కారణంగా వరదలు, విపత్తుల్లో చెక్కుకున్న వారికి తన వంతు సహాయంగా ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్న‌ సంగతి తెలిసిందే. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆమెకు అభినందనలు తెలియజేశారు.