టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ నేరం ఒప్పుకున్నట్లు నర్సింగ్ పోలీసులు వివరించారు. ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్టర్ కి బెయిల్ ఇపించనున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాస్టర్ కి బెయిల్ ఇప్పించడంలో అసలు తప్పేముంది అంటూ ప్రశ్నించారు. ఎందుకంటే అసలు నేరం ఇంకా రుజువే కాలేదు. అలాగే అల్లు అర్జున్ తన సినిమాలో నటించిన కేశవకి బెయిల్ ఇప్పించి షూట్ ప్రారంభించుకున్నారు. ఇక కేశవా అయితే ఓ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసిన నేరం పూర్తిగా రుజువైన తరువాతనే అల్లు అర్జున్ బెయిల్ ఇప్పించి బయటకు తీసుకువచ్చి మూవీ షూట్ చేసుకున్నాడు.
అలాంటప్పుడు పవన్ కళ్యాణ్.. జానీ మాస్టర్కు బెయిల్ ఇప్పించకపోవడం తప్పవుతుంది. కానీ.. ఇప్పిస్తే అందులో తప్పేముంటుంది అంటూ పవర్ స్టార్ ఆయనకు సపోర్ట్ గా నిలవడంలో తప్పులేదు.. ఎందుకంటే ఇంకా నేరం రుజువు కాలేదంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ అమ్మాయి సపోర్ట్ గా నిలిచే వారిలో కూడా ఎక్కడో కాస్త తేడా ఉంటుంది.. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా సైలెంట్ గా ఉన్న ఆ యువతి ఇప్పుడు బయటకి ఎందుకు వచ్చింది అని చాలామందిలో సందేహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ తప్పు చేసిన బెయిల్ పై పవన్ బయటకు తీసుకురావచ్చు. అలాగే రీసెంట్గా ఎమ్మెల్యే ఆదిమూలం తప్పు చేశారని వీడియోతో సహా బయటపడ్డ కోర్టు బయటే వీరి మేటర్ తేలిపోయింది. వీరి మధ్య ఉన్న ఇష్యూ ని కూడా కోర్టు బయట సెటిల్ చేసేసారు.
అలా జానీ మాస్టర్ ఇష్యుని కూడా కోర్టు బయట సెటిల్ చేసుకోవచ్చు అంటూ సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సెన్సేషనల్ ని కామెంట్ చేశాడు. మరి జానీ మాస్టర్ కి.. పవన్ కళ్యాణ్ బెయిల్ ఇప్పించడం నిజమేన.. కాదా.. అసలు ఆయన జానీ మాస్టర్ కు బయలు ఇప్పిస్తారా.. తెలియాలంటే అధికారిక సమాచారం అందేవరకు వేచి చూడాల్సిందే. ఇక జానీ మాస్టర్ భార్య కూడా ఇండస్ట్రీలోని పెద్దలు, డ్యాన్స్ అసోసియేషన్లోని వాళ్లందరినీ కలిసి జానీ మాస్టర్ కేసు గురించి మాట్లాడిందని.. మాస్టర్ కు మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇక ముందు ముందు జానీ మాస్టర్ వివాదం ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.