న్యాచురల్ స్టార్ నాని హీరోగా.. వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో తెరకెక్కిన తాజా మూవీ సరిపోదా శనివారం. నేడు (ఆగష్టు29)న ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు.. మ్యూజిక్ మరింత హైలెట్ గా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తమిళ్ స్టార్ డైరెక్టర్.. కమ్ నటుడు ఎస్ జె సూర్య ఈ సినిమాలో నాని ప్రతి నాయకుడిగా నటించి మెప్పించారు.
ఇక రిలీజ్కు ముందే ప్రేక్షకుల్లో మంచి భజ్ను క్రియేట్ చేసింది. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కి.. మొదటి రోజు.. ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ను సంపాదించుకుంది. దసరా, హయ్ నాన్నలతో హిట్ కొట్టిన నాని.. ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నాని ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే సినిమా పాజిటివ్ టాక్ రావడంతో.. సినిమా ఓటిటిలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా..? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందా..? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది.
కాగా తాజాగా ఓటిటి స్ట్రీమింగ్ రైట్స్ను ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుందని సమాచారం. అయితే సౌత్ రైట్స్ మాత్రమే దక్కించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు హిందీ ఓటిటి హక్కులను జియో సినిమాస్ కొనుగోలు చేసిందట. ఈ మూవీ రిలీజ్ అయిన నెల రోజుల్లోపే.. ఓటిటిలోకి రానుందని క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతుంది. సెప్టెంబర్ 26 నుంచి సినిమా స్ట్రీమ్మింగ్ కానుందట. అదే రోజు రెండు ఓట్టీల్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఒకవేళ ఈ వార్త నిజమైతే సరిపోదా శనివారం నెల రోజుల్లో ఓటిటి లో చూసే అవకాశాన్ని ఫ్యాన్స్ కొట్టేసినట్టే.