చెట్టు వెనక్కి వెళ్లి బట్టలు మార్చుకోవాల్సి వచ్చింది.. చాలా ఇబ్బందులు పడ్డా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్ గా రాణించాలంటే ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. సవాళ్లను, విమర్శలను ఎదురుకోవాల్సి ఉంటుంది. అలా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తర్వాత స్టార్ ఇమేజ్ క్రియేట్ అయి వారికి లగ్జరీ లైఫ్ వస్తుంది. సాధారణంగా ప్రేక్షకులంతా వీరిది లగ్జరీ లైఫ్ వీరికి ఎలాంటి కష్టం ఉండదని భావిస్తూ ఉంటారు. కానీ ఆ స్టేజ్ కు రావడానికి వారు ఎన్నో కష్టాలను చెవిచూస్తారు. అలానే ప్రస్తుతం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న క‌రిష్మ క‌పూర్ ప‌లు షాకింగ్ విష‌యాల‌ను రివీల్ చేసింది. 90లలో తన అందం, అభినయంతో లక్షలాదిమందిని కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. కొద్దిరోజులుగా ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలో బాలీవుడ్ లో తన పాత రోజులను గుర్తు చేసుకున్న కరిష్మా మొదటి సినిమా అనుభవాలను ఆ సమయంలో తన ఎదుర్కొన్న సవాళ్లను అభిమానులతో షేర్ చేసుకుంది.

అప్పట్లో హీరోయిన్లకు క్యారవాన్ ఉండేది కాదని.. అందుకే బట్టలు మార్చుకోవాలంటే ఏ చెట్టు వెనకాలకో వెళ్లి బట్టలు మార్చుకునే వాళ్ళమని.. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనే వాళ్ళమని.. వాష్ రూమ్‌కి వెళ్లడానికి కూడా బాత్రూమ్స్ ఉండేవి కాదని.. దానికి కూడా చెట్టు వెనకకి వెళ్లాల్సి వచ్చేదని.. కానీ గత 45 ఏళ్లలో ఎన్నో మార్పులు వచ్చాయంటూ చెప్పుకొచ్చింది. ఇప్పుడు హీరోయిన్స్ పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు అంటూ వివ‌రించింది. మొదటి సినిమా టైంలో విషయాలను గుర్తు చేసుకుంటూ తొలిసారిగా సెట్స్ పై మానిటర్ ను ఉపయోగించారని.. డ్యాన్స్ షూట్ టైంలో షూటింగ్ కు వచ్చినప్పుడు యాక్టింగ్, డ్యాన్స్ చూసి ఎంజాయ్ చేసే వాళ్ళమని.. తర్వాత మానిటర్లో వచ్చి మళ్లీ ఆ సన్నివేశాలను చూసే వాళ్ళమంటూ చెప్పుకొచ్చింది.

ఓ మూవీ షూటింగ్ టైంలో తను మొదటి.. వాయిస్ ఇన్ గురించి తెలుసుకున్న అంటూ వివరించింది. తన వాయిస్ కోసం యాపిల్ మైక్రోఫోన్ ధరించడం అదే మొదటిసారి అంటూ వివరించింది. అయితే మొదట ప్రేమ్ కాడి సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కరిష్మా తర్వాత జిగర్, రాజాబాబు, హిందుస్తానీ ఇలా ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. దేశంలోనే అతిపెద్ద వ్యాపారవేత సంజయ్ కపూర్‌ను వివాహం చేసుకున్న ఈ అమ్మడు.. తర్వాత నటనకు దూరమైంది. కానీ.. వీరి పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. 2016లో ఈ జంట విడాకులు తీసుకుంది. పెళ్లయిన మొదటి రోజే భర్త సంజయ్ కపూర్ తనను వేధించాడని, చిత్రహింసలకు గురి చేసాడంట చెప్పుకొచ్చింది. సంజయ్ కపూర్ కు విడాకుల టైంలో భారీ భరణం డిమాండ్ చేసినా కరిష్మా.. విడాకుల తర్వాత అతని నుంచి విలాసవంతమైన విల్లాతోపాటు రూ.14 కోట్ల భారణాన్ని తెచ్చుకుంది.