టాలీవుడ్ స్టార్.. మాస్ మహారాజు రవితేజ.. హీరోగా పూరి జగన్నథ్ డైరెక్షన్లో నేనింతే మూవీ నటించిన సంగతి తెలిసిందే. 2008లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్నా ఊహించిన రేంజ్లో సక్సెస్ కాలేకపోయింది. దీంతో మూవీ కలక్షన్ల పరంగా డీలా పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా శియా గౌతమ్ నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ.. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
తన నటనతో మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే శియా గౌతమ్ అసలు పేరు అదితి గౌతమ్. నటనపై ఉన్న ఇంట్రెస్ట్ తో మోడలింగ్లో అడుగుపెట్టి మెల్లమెల్లగా సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత శియా గౌతమ్గా పేరు మార్చుకుంది. అయితే నేనింతే సినిమాలో తను నటనతో ఆకట్టుకున్న ఈ సినిమా ఫ్లాప్ కావడంతో.. తర్వాత ఈ అమ్మడుకు టాలీవుడ్ అవకాశాలు ఏవి దక్కలేదు.
తర్వాత హిందీలో రణ్బీర్ కపూర్ హీరోగా నటించిన సంజు మూవీలో మెరిసింది. కానీ అక్కడ కూడా అమ్మడికి వర్కౌట్ కాలేదు. దీంతో సినిమాలకు దూరమైన శియా గౌతమ్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్గా ఉంటూ రెగ్యులర్గా తనకు సంబంధించిన గ్లామర్ ఫోటోలను, వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఫిదా చేస్తుంది. రవితేజ సరసన బొద్దుగా పద్ధతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ షోలతో కుర్రాలలో సెగలు రేపుతుంది. ఈ క్రమంలో తాజాగా ఈమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ నెటింట తెగ వైరల్గా మారుతున్నాయి.