మెగా, అల్లు కుటుంబాల మధ్యన కోల్డ్ వార్ జరుగుతుంది అంటూ గత కొంతకాలంగా వార్లు తెగ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడైతే నంద్యాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ కు ఆపోజిట్గా ఉన్న తన స్నేహితుడికి బన్నీ సపోర్ట్ గా ప్రచారంలో పాల్గొనాడో అప్పటినుంచి మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ పై ఎటాక్ మొదలుపెట్టారు. నెగిటివ్ కామెంట్స్, ట్రోల్స్ చేస్తూ అల్లు అర్జున్ పై తెగ ఫైర్ అవుతున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ల మధ్యన వివాదాలు చోటుచేసుకున్నాయంటూ కూడా వార్తలు వినిపించాయి.
అయితే తాజాగా ఈ విషయంపై స్టార్ కమెడియన్ హైపర్ ఆది స్పందించారు. శివం భజే మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన.. దీనిపై మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డ్ విన్నర్.. ఆయన్ని అందరూ గౌరవించాలి.. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. అల్లు అర్జున్కి.. మెగా ఫ్యామిలీకి మధ్యన ఎలాంటి చిన్న చిన్న గొడవలు ఉన్నా.. వారందరిది ఒకటే ఫ్యామిలీ. కొందరు కావాలనే బన్నీని ఉద్దేశపూర్వకంగా ట్రోల్స్ చేస్తున్నారు. థంబ్నెయిల్స్తో ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి అలా చేయడం మానేయండి.. ఇక నుంచి అయినా ఇలాంటి నెగటివ్ కామెంట్స్ ట్రోల్స్ ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ వివరించాడు.
అయితే అది చెప్పినంత మాత్రాన మెగా ఫ్యాన్స్ ఆయనను ట్రోల్స్ చేయడం అపస్తార అంటే అది జరగని పనే. ఓ పక్కన అల్లు ఆర్మీ కూడా ఇప్పటికే మెగా హీరోలపై.. మెగా ఫ్యాన్స్ పై రకరకాల కామెంట్స్ చేస్తూ రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు ఒకటిగా ఉన్న మెగా ఫ్యాన్స్ అంతా అల్లు అర్జున్ చేసిన పనితో విడిపోయారు. ఈ క్రమంలో అల్లు ఆర్మీ రంగంలోకి దిగి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఆది చెప్పిన ఇప్పటికైనా ఈ వివాదాలకు కాస్తయినా చెక్ పడుతుందేమో.. ఎదైన మార్పు వస్తుందేమో చూడాలి.