శ్రీదేవి కూతురుగా జాన్వి కపూర్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అమ్మడు స్క్రీన్పై పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. గ్లామర్ పరంగా మాత్రం మిలియన్ కొద్దిగా అభిమానులను పొంతం చేసుకుని దూసుకుపోతుంది. మొదట బాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు గ్లామర్ పరంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుని.. వరుస సినిమాలతో హాట్ టాపిక్టా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక తాజాగా అనంత్ అంబానీ వెడ్డింగ్ లో జాన్వి కపూర్ మైండ్ బ్లోయింగ్ లుక్లో కనిపించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. గోల్డ్ కలర్ డ్రెస్సులు మెరుపులు కురిపించిన ఈ ముద్దుగుమ్మ.. చూడడానికి దేవకన్యలా ఉందని.. అందాల అతిలోక సుందరి అని అభిమానులు తమ అభిప్రాయాని వ్యక్తం చేవారు.
దగదగా మెరుపులతో యువరాణిలా వెడ్డింగ్లో ఎంట్రీ ఇచ్చిన జాన్వికపూర్ ఫొటోస్ ప్రస్తుతం తెగ వైరల్గా మారాయి. ఈ ఫొటోస్ను జాన్వి తన సోషల్ మీడియా వేదికగా కూడా అభిమానులతో షేర్ చేసుకుంది. ఇక జాన్వి ప్రస్తుతం ఎన్టీఆర్ శాసన దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పాన్ ఇండియన్ లెవెల్లో మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే నార్తోలో భారీ పాపులారిటీ ఉన్న జాన్వీ దేవర సినిమాని ప్రమోట్ చేస్తూ సినిమాపై హైప్ మరింతగా పెంచుతుంది. ఈ మూవీలో జాన్వీ పాత్ర పేరు తంగం అని మేకర్స్ గతంలోనే రివీల్ చేశారు. ఈ క్రమంలో తన పాత్ర ఆడియన్స్కు బాగా రీచ్ అవ్వాలని ఉద్దేశంతో జాన్వి సోషల్ మీడియా వేదికగా ప్రమోషన్స్ ను మొదలు పెట్టేసింది.
భలే ప్లాన్తో ప్రమోషన్స్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. తాజాగా అంబానీ వెడ్డింగ్కి ధరించిన ఫోటోలు సోషల్ మీడియా వేదికగా అమ్మడు షేర్ చేస్తూ.. తంగం హ్యాష్ట్యాగ్ జోడించింది. దీంతో జాన్వీ, ఎన్టీఆర్ దేవర సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుందని.. అందుకే ఇలా తన దేవర నేమ్ను ట్యాగ్ చేస్తూ ఫోటో షేర్ చేసిందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు తారక్ అభిమానులు. ఈ సినిమాతో తారక్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని జాన్వికి కూడా మంచి పేరు వస్తుందంటూ నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సెప్టెంబర్ 27న దేవర మొదటి భాగం రిలీజ్ కానుంది.
View this post on Instagram