సీనియర్ స్టార్ నటుడు నరేష్ కొద్దిరోజుల క్రితం పెద్దఎత్తున తన వ్యక్తిగత విషయాలతో నెటింట వైరల్గా మారిన సంగతి తెలిసిందే. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్.. పర్సనల్ లైఫ్లో మాత్రం ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. ఎన్నో వివాదాలు చూశాడు. తన వ్యక్తిగత జీవితంలో ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న ఈయన.. తన ముగ్గురు భార్యలకు విడాకులు ఇచ్చి.. ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్తో రిలేషన్ను మెయింటైన్ చేస్తున్నాడు. ఇక వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.
అయితే అఫీషియల్ గా దీనిపై ప్రకటన రాలేదు. ఇక ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్న నరేష్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అమ్మడి గురించి షాకింగ్ కామెంట్స్ చేశాడు. తను.. తన తల్లి విజయనిర్మల చనిపోయినప్పుడు మానసికంగా ఎంతగానో కృంగిపోయానని.. కానీ కృష్ణ గారిని చూసి ధైర్యం తెచ్చుకున్నాను అంటూ వివరించాడు. అయితే కృష్ణ గారు కూడా మరణించిన తర్వాత.. నాకు దిక్కుతోచలేదని.. ఒక్కసారిగా డౌన్ ఫాల్ అయిపోయాను అంటూ చెప్పుకొచ్చాడు.
అలాంటి సమయంలో పవిత్ర తనకు ఎంతో సపోర్ట్ గా నిలిచిందని. అండగా ఉందని చెప్పుకొచ్చాడు. అమ్మ, కృష్ణగారు ఇద్దరు చనిపోయినప్పుడు పవిత్రలో నేను ఓ అమ్మవారిని చూసా.. ఓ మంచి ఫ్రెండ్ని చూసా.. ఒక గైడ్, ఓ అమ్మ, ఓ కూతురు ఇలా అన్ని తనలో చూసుకున్న అంటూ వివరించాడు. పవిత్ర లాంటి ఒక వ్యక్తి పక్కన ఉంటే జీవితంలో మనం మరో ఆడదాని వైపు చూడాల్సిన అవసరం ఉండదు అంటూ.. అందరినీ ఆమెలోనే చూసుకోవచ్చు అంటూ పవిత్ర గురించి వివరించాడు. ప్రస్తుతం నరేష్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్గా మారాయి.