స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. డివోర్స్ తర్వాత స్యామ్ మానసికంగా కృంగిపోవడమే కాదు.. మయోసైటిస్ వ్యాధి వారణ పడి ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. కొన్ని రోజులు పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అమ్మడు హెల్త్ పై ఫోకస్ చేసింది. మానసిక ప్రశాంత త కోసం వెకేషన్ ఎంజాయ్ చేస్తూ, ధ్యానం చేస్తూ ఉండేది. అలా తనకు సంబంధించిన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంది. అయితే సమంత చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి.
నా జీవితం కూడా మరో సావిత్రిలా అయ్యుండేది.. తృటిలో నేను తప్పించుకున్న అంటూ ఓ సందర్భంలో సమంత చేసిన కామెంట్స్ తెగ వైరల్ గా మారాయి. సావిత్రి, జెమినీ గణేషన్ వివాహం చేసుకొని ఆయన వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకోవడంతో అది భరించలేక ఆమె వ్యసనాలకు బానిసై ఆస్తిని పోగొట్టుకుని.. కోమాలోకి వెళ్లి చివరి క్షణం వరకు జీవత్సవంలాగే బ్రతికింది. డిసెంబర్ 26న ఆమె తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అప్పట్లో టాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం శోకసంద్రంలో మునిగింది. కాగా ఓ సందర్భంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత తన లైఫ్ కూడా అలానే అయి ఉండేది అంటూ వివరించిన మాటలు వైరల్ అవుతున్నాయి.
తనకు సావిత్రి గురించి అంతగా తెలియదని.. కానీ మహానటి సినిమాతో కొంచెం ఐడియా వచ్చిందని.. అప్పుడు నాకు అనిపించింది నా జీవితం కూడా అలాగే అయ్యేదేమో.. సావిత్రి గారిలా నేను కూడా ప్రేమ విషయంలో ఒకసారి మోసపోయా.. కానీ అదృష్టం దానినుంచి బయటపడ్డా. లేకపోతే నా లైఫ్ కూడా అలానే అయి ఉండేది అంటూ సమంత కామెంట్స్ చేసింది. ఇప్పుడు ఆ కామెంట్స్ నెటింట తెగ వైరల్ గా మారాయి. అయితే దీంతో ఈ కామెంట్స్ విన్న కొందరు స్యామ్.. సిద్ధార్థ ను ఉద్దేశించి అలాంటి కామెంట్స్ చేసిందంటూ.. మరికొందరు చేతును ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకుంది కదా.. చైతన్యన్ని ఉద్దేశించే ఇలాంటి కామెంట్స్ చేసిందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.