టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ డైరెక్టర్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేరు రాజమౌళి. తను తెరకెక్కించే ప్రతి సినిమాతో 100% సక్సెస్ అందుకొని స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న రాజమౌళి.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో స్టార్ డైరెక్టర్గా ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రాజమౌళి దాదాపు తన సినిమాలకు ఇతర ఏ రైటర్ల కథలను ఎంచుకొరన్న సంగతి తెలిసిందే. కేవలం తను తెరకెక్కించిన మొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1 సినిమాకు మాత్రమే రాజమౌళి బయట నుంచి రైటర్ ఇచ్చిన కథను ఎంచుకున్నారు. ఆ సినిమా తర్వాత కూడా రాజమౌళి ఇతర రైటర్ల కథలను విన్నారట. ఓ సందర్భంలో 250కి పైగా కథలు విన్న రాజమౌళికి ఏ ఒక్కటి కూడా నచ్చలేదట.
ఇదే ఇతర రైటర్ల కథలకు జక్కన్న ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి అసలు కారణం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. విజయేంద్ర ప్రసాద్ చెప్పిన కథలో చిన్న చిన్న సమస్యలు ఉన్నా.. ఇద్దరి ఆలోచన విధానం ఒకటే కావడంతో.. రాజమౌళి తెరకెక్కించే సమయంలో ఆ తప్పులను తన వేలో సరిదిద్ది తెరకెక్కిస్తాడని.. ఇది ఆయనకు సులభంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే రాజమౌళి తన తండ్రి విజయేంద్రప్రసాద్ ఇచ్చిన కథలతోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే 12 సినిమాలు తెరకెక్కించి.. 12 సినిమాలతో సక్సెస్ అందుకున్న జక్కన్న.. ప్రస్తుతం మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక జక్కన్న సినిమా అంటే దాదాపు మూడేళ్లు ఎదురుచూపులు తప్పవు.
అలాంటిది మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా కోసం మరింత ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాను మరింత ప్రతిష్టాత్మకంగా.. ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నాడట జక్కన్న. అయితే కేవలం ఈ సినిమాకే మహేష్ బాబుకు నాలుగు సంవత్సరాల సమయం పడితే.. మహేష్ సినిమా ఈ నాలుగు సంవత్సరాలు వెండి తెరపై చూడడానికి ఉండదు అనే నిరాశ అభిమానులలో నెలకొంది. జక్కన్న సినిమాలో నటిస్తూనే ఇతర సినిమాల్లో నటించడానికి కూడా మహేష్ కు పర్మిషన్ ఇస్తే బాగుంటుందంటూ మహేష్ అభిమానులు రాజమౌళికి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.