స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ అగ్ర హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో దూసుకుపోయింది. అయితే మెల్ల మెల్లగా ఫ్లాప్లు రావడంతో అమ్మడికి ఇక్కడ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్ కి మక్కాం మార్చేసిన ఈ బ్యూటీ అక్కడే సెటిల్ అయ్యిపోయింది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా మంచి క్రేజ్ సంపాదించుకున్న జాకీ భగ్నానిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత మ్యారేజ్ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది.
ఇలాంటి క్రమంలో తాజాగా రకుల్ ప్రీతి కుటుంబానికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్గా మారింది. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని రాజేంద్రనగర్ సమీపంలో పోలీసులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసులు తనిఖీలు 200 గ్రామ్స్ డ్రగ్స్ పట్టుబడ్డాయి. దాని విలువ సుమారు రెండు కోట్లు ఉంటుందని సమాచారం. నార్కోటిక్, ఎస్ఓటి రాజేంద్రనగర్ పోలీసులు ఈ జాయింట్ ఆపరేషన్ నిర్వహించగా.. నలుగురు కొక్కైన తరలిస్తూ దొరికిపోయారు. వారిలో సినీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమాన్ సింగ్ కూడా ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
అమాన్ సింగ్ తో పాటు నలుగురు నైజీరియన్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ డ్రగ్స్ దందా.. గోవా కేంద్రంగా నడుస్తున్నట్లు దొరికిపోయిన నిందితులు పోలీసులకు వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు దొరికిపోవడం ప్రస్తుతం నెటింట కలకలం గా మారింది. గతంలో రకుల్ ప్రీతి ఓ డ్రగ్స్ వివాదంలో చిక్కుకొని విచారణలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.