గత పది రోజులుగా ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరుగుతున్న సంగతి తెలిసిందే. జూలై 12న శుక్రవారం 8 గంటలకి ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ వేదికగా అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఏడడుగులు వేసి వైవాహిక బంధం లోకి అడుగుపెట్టారు. ఈ వేడుకకు అన్ని దేశాల నుంచి సినీ, రాజకీయ వర్గాలకు చెందిన ప్రముఖులంతా హాజరై సందడి చేశారు. ఇందులో భాగంగానే సౌత్, నార్త్ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో 10 రోజులుగా బాలీవుడ్ తారలు ఉత్సాహంగా పాల్గొని సందడి చేస్తున్నారు.
మామ్మగర్ వేడుక నుంచి సంగీతా, హల్ది, మెహందీ ఇలా అన్ని వేడుకల్లోను బాలీవుడ్ స్టార్స్ హాజరై ప్రేక్షకులకు కనువిందు చేశారు. ఇక నిన్న జరిగిన వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా హాజరయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన భార్య ఉపాసనతో.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార, భార్య నమ్రతతో కలిసి పాల్గొన్నారు. ఇక నయనతార, విజ్ఞేశ్ శివన్.. జ్యోతిక, సూర్య.. రాణా దగ్గుబాటి.. భార్య మెహికతో కలిసి వేడుకకు హాజరై సందడి చేశారు.
కాగా ఈ పెళ్లి వేడుకల్లో అత్యంత స్పెషల్ ఎట్రాక్షన్గా సూపర్ స్టార్ రజినీకాంత్ నిలిచాడు. వరుడు అనంత్ అంబానీతో కలిసి.. తలైవా డ్యాన్స్ చేసిన వీడియో.. ప్రస్తుతం తెగ వైరల్గా మారింది. బాలీవుడ్ హీరోస్ అర్జున్ కపూర్, రణ్వీర్ సింగ్, విక్కీ కౌశల్తో కలిసి అనంత అంబానీ, రజనీకాంత్ చిందులేసారు. 73 ఏళ్ల వయసులోనూ డ్యాన్స్ స్టెప్పులు కుమ్మేసాడు రజిని. దీంతో అక్కడ ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీస్ నుంచి సౌత్, నార్త్ సెలబ్రిటీస్ అంతా ఆయనను చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ వీడియో నెటింట వైరల్ అవడంతో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రజిని అభిమానులంతా ఆయన డ్యాన్స్ చూసి, స్టైల్ చూసి తెగ మురిసిపోతున్నారు. ఇక ఈ వేడుకలో రజనీకాంత్ తో పాటు తన భార్య లత, కూతురు ఐశ్వర్య కూడా హాజరయ్యారు.