ఎన్నో రోజులుగా ప్రభాస్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి 2898 ఏడీ.. మరో రెండు రోజుల్లో ప్రేక్షకులం ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ హీరోగా భైరవ పాత్రలో నటించాడు. బాలీవుడ్ బిగ్బి అమితాబచ్చన్ పవర్ఫుల్ అశ్వద్ధామ రోల్ ప్లే చేసాడు. ఇక ఈ సినిమాను నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి ప్రేక్షకులను జోష్ పెంచేందుకు ఏవో ఒక్క అప్డేట్లు ఇస్తూనే ఉన్నారు మేకర్స్. ఇందులో భాగంగా అమితాబ్ తాజాగా ఆసక్తికర విషయాని షేర్ చేసుకున్నాడు. అలాగే కమల్ హాసన్ కూడా ఈ సినిమాను యాక్సెప్ట్ చేయడానికి ఏడాది సమయం తీసుకున్నాను అంటూ వివరించాడు.
కల్కిలో లోక నాయకుడు కమల్ హసన్ నెగెటివ్ పాత్రలో నటించాడు. కమల్ ఈ మూవీలో సుప్రీంయాస్కీన్ పాత్రలో ప్రేక్షకులకు కనిపించనున్నాడు. ఇక తాజాగా కమల్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తన పాత్రను అంగీకరించడానికి ఏడాది సమయం తీసుకున్నానని.. ఈ పాత్ర గురించి చెప్పగానే నాకు ఓ సందేహం వచ్చిందని.. నేను దీన్ని చేయగలనా.. అని అనిపించిందని చెప్పుకొచ్చాడు. గతంలో చాలా సినిమాల్లో విలన్ గా నటించా. కానీ.. ఇది వాటికి మించిన భిన్నమైన భయంకరమైన పాత్ర.. అందుకే దీనికి సైన్ చేయడానికి ఏడాది టైం తీసుకున్న అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ నేపథ్యంలో అమితాబచ్చన్ కూడా సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు నాగ్ అశ్విన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. కల్కిలో విజువల్స్ అసలు నమ్మశక్యంగా ఉండవని.. అన్నింటిని తెరపై అంతే అద్భుతంగా నాగ్ అశ్విన్ చూపించాడు అంటూ వివరించారు. ఇంత గొప్ప ప్రాజెక్టులో భాగం కావడం నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి అనుభవం అంటూ చెప్పుకొచ్చాడు. నాగి ఈ కథ చెప్పి వెళ్లిన తర్వాత ఇతను ఏం తింటున్నాడు.. ఇంత గొప్పగా ఎలా రాయగలిగాడు.. అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అమితాబ్, కమల్ చేసిన ఈ కామెంట్స్ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి.