గత కొన్ని రోజులుగా కన్నడ ఇండస్ట్రీని పవిత్ర దర్శన్ కేసు ఏ రేంజ్ లో అల్లాడించేస్తుందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా తన ప్రియురాలిని టార్చర్ చేస్తున్నారు అని తెలిసి రేణుక స్వామిని అతి కిరాతకంగా క్రూరంగా హత్య చేసిన కేసులో కన్నడ స్టార్ నటుడు దర్శన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే . ఈ కేసు రోజుకు ఒక మలుపు తిరుగుతూ వచ్చింది . కాగా ఈసారి ఎవరు ఊహించిన విధంగా దర్శన్ కేసులో ఊహించని షాకింగ్ పరిణామాలు చూస్తున్నాము.
దర్శన్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది . దర్శన్ పర్సనల్ మేనేజర్ సూసైడ్ చేసుకొని మరణించాడు. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆయన సూసైడ్ చేసుకొని మరణించడంతోపాటు సూసైడ్ నోట్ కూడా రాశారు . పోలీసులు ఆ విషయాన్ని వెల్లడించారు . అంతేకాదు సూసైడ్ నోట్లో ఎక్కడా కూడా అనుమానించే విషయాలు లేవు అంటూ క్లారిటీ ఇచ్చారు.
“దర్శన్ అరెస్ట్ విషయం తట్టుకోలేకపోయాను అని.. ఆయన బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నాను అని ..మనసు కృంగిపోతుంది అని ఆ డిప్రెషన్ లోనే ఇలా సూసైడ్ చేసుకుంటున్నాను అని రాసుకోచ్చారట. దీంతో కన్నడ ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది ..ఇది నమ్మశక్యంగా లేదు అంటున్నారు కొంతమంది అభిమానులు.. కచ్చితంగా ఆయనకి రేణుక స్వామి హత్య కేసుకి ఏదో సంబంధం ఉంది అని జనాలు మాట్లాడుకుంటున్నారు”. దీంతో కన్నడ ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వెరీ వెరీ హాట్ టాపిక్ వైరల్ గా మారింది..!!