అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తాజాగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హిస్టోరికల్ డ్రామా సినిమా మహారాజుతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సినిమా బిగ్ స్క్రీన్ పై రిలీజ్ కాలేదు. కానీ.. ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో జూన్ 21న రిలీజై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. అంతే కాదు జునైద్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇక ఇదే సినిమాలో చూపించిన కిషోరి పాత్ర కూడా ఆడియన్స్ కు బాగా నచ్చేసింది. కిషోరి పాత్రల్లో షాలిని పాండే నటించిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమా గురించి అమ్మడు కొన్ని ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ఇక ఈ అమ్మడు టాలీవుడ్ మూవీ అర్జున్ రెడ్డితో ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసింది. ఈ సినిమాలో బోల్డ్గా నటించిన షాలిని.. తన మొదటి సినిమాతోనే ఓవర్నైట్ స్టార్గా మారింది. ఇక ఈ మూవీకి తాజాగా యానిమల్తో రికార్డ్లు క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. ఇక ఇటీవల తను నటించినా మహారాజ మూవీలో కూడా కొన్ని ఇంటిమేట్ సీన్స్ లో కనిపించింది షాలిని. ఈ క్రమంలో ఇంటిమేట్ సీన్స్ గురించి అమ్మడు మాట్లాడుతూ.. అలాంటి సన్నివేశాల్లో నటించిన అంత ఈజీ కాదని.. సినిమాకు సంబంధించిన ఓ రొమాంటిక్ సన్నివేశం గురించి వివరించింది.
షాలినీ మాట్లాడుతూ ఈ సినిమాలో శృంగారభరిత సన్నివేశంలో కనిపించే ఆ సీన్ షూట్ చేసే ముందు నేను భయంతో బయటకు పరిగెత్తా.. ఎందుకంటే అప్పుడు చాలా ఒత్తిడిగా అనిపించింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలాంటి వాతావరణం, చీకటి ఉన్నప్పుడు.. తనకు భయం ఎక్కువ అని.. పేర్కొన్న ఈ అమ్మడు.. అందుకే ప్రశాంతమైన వాతావరణం కావాలని దర్శకుడిని అడిగానంటూ చెప్పుకొచ్చింది. కాగా నా ప్రాబ్లమ్ దర్శకుడు అర్థం చేసుకుని నాకు స్పేస్ ఇచ్చాడని.. తర్వాతే ఆ సీన్ పూర్తి చేయగలిగా అంటూ వివరించింది. 1800 లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా సిద్ధార్థ మల్హోత్ర.. ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో స్త్రీలను హత్యాచారం చేసే ఒక క్రూరమైన పాత్రలో నటుడు జైదీప్ కనిపించాడు.