కల్కి సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు శంబల. ఇది దేవతలు భూలోకంలో సంచరించే ప్రాంతంగా చెప్పుకుంటూ ఉంటారు . ఇది హిమాలయాల్లోని అంత చిక్కని ప్రదేశం అని చాలా తక్కువ మందికే తెలుసు . శంబల సంస్కృత పదం. డిబేట్లో దీన్ని ష్యాంఘిలా అంటారు . హిందూ పురాణాలలో శంబలను సిద్ధ అశ్రమం అంటారు. భూలోక స్వర్గం అని కూడా పిలుస్తారు . ఇది కైలాస పర్వతం మానస సరోవరం సమీపంలోనే ఉంది అంటూ చెప్పుకొస్తూ ఉంటారు . పురాణాల శాస్త్రాల ప్రకారం కొందరు చరిత్రకారులు చెప్పిన విషయాల ప్రకారం ఎవరెస్టు అడుగున ఒక సొరగం మార్గం ఉంటుందట .
దాని గుండా వెళ్తే గడ్డకట్టిన మంచు నది కూడా ఉంటుందట . అది దాటితే ఓ పర్వతం వస్తుంది. అందులో ఒక గుహ వస్తుంది. అక్కడ సిద్ధ పురుషుడు తపస్సు చేస్తూ ఉంటారట. దానిని దాటుకొని వెళ్తే శ్రీ చక్రం స్పటిక పర్వతం కనిపిస్తాయట . స్పటిక పర్వతం కిందనే రహస్యంగా ఉన్న నగరం ఈ శంబలా అంటూ ఉంటారు . అలానే 13వ దలైలామా తన గురువు తాసిలామాతో కలిసి తాళపత్ర గ్రంధాలలో ఎన్నో రహస్య విషయాలు కూడా ఇక్కడ ఉన్నాయట .
అయితే 1903లో కొందరు భారతీయ శాస్త్రవేత్తలు కొందరు గూఢచారులో శంబలా నగరాన్ని అన్వేషిస్తూ వెళ్లారట . ఈ క్రమంలోనే వారు తమ ప్రయాణంలో హిమాలయాలలో చూసిన వింతలన్నిటిని ఒక నివేదిక తయారు చేయించారట . ఇది అప్పట్లో పెను సంచలనం సృష్టించింది . ఆ తర్వాత చాలామంది శంబలాను చూడడానికి ప్రయత్నాలు చేశారు . కానీ కుదరలేదు ..శంబల గురించి ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి నికోలాస్ రోచిత్. రష్యన్ చిత్రకారుడు .
భారతీయ సాంప్రదాయాలకు ఫిదా అయిన రోచిత్ కుల ప్రాంతంలో ఆశ్రమం నిర్మించుకొని ఉండిపోయాడు . ఆయన మరణించే వరకు శబల గురించి అన్వేషిస్తూనే ఉండడం అందరికీ ఆశ్చర్యకరంగా అనిపించింది. రోచిత్ రాసిన పుస్తకంలో కల్కి జన్మించడానికి ముందు ఎర్రని రాయితో చేసిన గుర్రం సేకరించడమే కాక ఈ జీవశీలి దేశంలోని అన్ని ప్రాంతాలలో తిరుగుతుంది అని కల్కి జన్మించడానికి ముందు శంబలకు చేరుకుంటాడు అని తన రచనల్లో చెప్పుకొచ్చాడు . కల్కి సినిమా ప్రభావం తో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది..!!