టాలీవుడ్ నటుడు దర్శకుడు ఉపేంద్రకు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిశ్రమ అవసరం లేదు. మొదటి పలు సినిమాల్లో హీరోగా.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఉపేంద్ర.. ఏ, ఉపేంద్ర, ఓం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలను తెరకెక్కించి ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్ గా నిలిచాడు. తను తెరకెక్కించే సినిమాలను రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలకు భిన్నంగా రూపొందించి పాన్ ఇండియా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఉపేంద్ర హీరోగా నటించిన ఏ మూవీ.. తెలుగులో జూన్ 21న రీ రిలీజ్ కానుంది. 1999లో కేవలం కోటి రూపాయలు బడ్జెట్ లో రివర్స్ స్క్రీన్ ప్లే టెక్నిక్ తో ప్రయోగాత్మకంగా వచ్చిన ఈ సినిమా రూ.20 కోట్లకు పైగా గ్రాస్ వసూళను కల్లగొట్టి నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.
ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రస్తుతం ఉపేంద్ర.. ఏ మూవీ రిలీజ్ ప్రమోషన్ లో బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగా తను చిరంజీవిని డైరెక్ట్ చేసే ఓ మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్నాను అంటూ వివరించాడు. ఏ సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత దర్శకుడుగా చిరంజీవితో సినిమా చేయాలనుకున్నానని.. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్విని దత్ ప్రొడ్యూసర్గా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేసుకున్నానని.. దీంతో చిరంజీవికి, అశ్విని దత్త్ ఇద్దరికీ కథను వినిపించగా వారిద్దరూ కథ నచ్చిందని వివరించాడు.
అయితే మెగాస్టార్ నటించే సినిమా అంటే సబ్జెక్టు పెద్దగా ఉండాలి.. నేను కొత్త డైరెక్టర్ కావడంతో ఆయన ఇమేజ్కు తగ్గట్టు స్టోరీని చేయలేకపోయా.. అందుకే ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే ఆగిపోయింది. అలా చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న అంటూ వివరించాడు. అలాగే రజనీకాంత్ గారు కూడా తనతో సినిమా చేయమని అడిగారని.. అమితాబచ్చన్ ప్రొడక్షన్ హౌస్ నుంచి డైరెక్టర్గా సినిమా అవకాశం వచ్చిందని.. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు అంటూ ఉపేంద్ర చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉపేంద్ర చేసిన కామెంట్స్ నెటింట వైరల్ అవ్వడంతో.. చిరంజీవి, రజనీకాంత్ లాంటి టాప్ స్టార్ హీరోలు సినిమా అవకాశాలు ఇచ్చిన ఉపేంద్ర మిస్ చేసుకున్నాడా అంటూ షాక్ అవుతున్నారు.