ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమలాపాల్ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియన్ స్టార్ హీరోలతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తర్వాత ఊహించిన రేంజ్ లో ఆఫర్స్ రాకపోవడంతో ఇండస్ట్రీకి దూరమైంది. ఈ క్రమంలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన అమలాపాల్ ఏవో మనస్పర్ధలతో మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది.
తర్వాత కొంత కాలానికే టూరిజం, అతిథి రంగాలను నిపుణుడిగా మంచి పేరు సంపాదించుకున్న జగత్ దేశాయ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. గతేడాది వీరిద్దరి పెళ్లి గ్రాండ్ లెవెల్ లో జరిగింది అయితే వివాహమైన కొద్ది నెలలకే ఈ అమ్మడు ప్రెగ్నెంట్ అంటూ అభిమానులకు గుడ్ న్యూస్ ని షేర్ చేసింది. అయితే ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ ఫోటోషూట్లతో సందడి చేస్తున్న ఈ అమ్మడు.. మధ్య మధ్యలో ట్రోల్స్ కూడా గురైంది.
అయితే తాజాగా ఈ అమ్మడు పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది. ఈనెల 11న అమలాపాల్కు మగ బిడ్డ పుట్టాడని.. అతనికి ఇళై అని పేరు పెట్టినట్లు సమాచారం. తాజాగా ఈ విషయాన్ని అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట వైరల్ గా మారడంతో.. అభిమానులంతా ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు. బాబు పేరు భలే ట్రెండీగా ఉందే అంటూ.. చాలా అద్భుతమైన పేరు పెట్టారు అంటూ.. కామెంట్స్ చేస్తున్నారు.