బిగ్ బ్రేకింగ్: రోడ్డు యాక్సిడెంట్ లో కన్నడ నటి పవిత్ర దుర్మరణం..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసేస్తుంది. రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర దుర్మరణం చెందారు . దీంతో ఆమె అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్ణాటకలోని తమ సొంత గ్రామానికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది . తెల్లవారుజామున ఒంటిగంట ప్రాంతంలో రోడ్ యాక్సిడెంట్ జరిగినట్లు పోలీసులు చెప్పుకొస్తున్నారు .

మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది. వేగంగా వస్తున్న వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీ కొనడంతోనే ఈ భారీ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును పవిత్ర పయనిస్తున్న కార్ ఢీ కొట్టింది .

ఈ ఘటనలో త్రినయిని అనే సీరియల్ లో మహిళ విలన్ పాత్రలో నటిస్తూ అందరిని ఆకట్టుకున్న బుల్లి తెర నటి పవిత్ర అక్కడికక్కడే మృతి చెందినట్లు కన్నడ మీడియా కన్ఫామ్ చేసింది . దీనితో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఆమెకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు . రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గర ఉన్న స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు . ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు . టాలెంటెడ్ యాక్టర్ పవిత్ర మృతి చెందడంతో కన్నడ బుల్లి తెర పరిశ్రమ తీవ్ర సోకసంద్రంలో మునిగిపోయింది..!!