ప్రభాస్ తో ఆ మూవీ చేసినందుకు ఇప్పటికి ఫీల్ అవుతున్న..అనుష్క శెట్టి షాకింగ్ కామెంట్స్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని రాద్ధాంతం చేయడం .. ఎక్కువగా ట్రోల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాము. రీసెంట్గా ఆ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది అనుష్క శెట్టి . ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవని హీరోయిన్ అనుష్క శెట్టి ఓ రేంజ్ లో ట్రోల్ చేసేస్తున్నారు రెబెల్ అభిమానులు . దానికి కారణం ఆమె మాట్లాడిన మాటలు .

గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చిన అనుష్క ..చాలా టైం గ్యాప్ తీసుకుని చేసిన మూవీ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఈ సినిమా తర్వాత రెండు మూడు చిత్రాల్లో నటిస్తున్నట్లు సమాచారం అందుతుంది . ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క – ప్రభాస్ సినిమాలో నటించిన దాని గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది.

” నేను – ప్రభాస్ – నమిత నటించిన బిల్లా చాలా చాలా బాగుంటుంది . అయితే ఇందులో బికినీ వేసుకోవాల్సి వస్తుంది . ఆ సమయంలో నేను చాలా చాలా ఇబ్బంది పడ్డాను . అప్పుడే అనిపించింది ఈ సినిమా ఒప్పుకోకుండా ఉంటే బాగుండేదేమో అని.. తెరపై అది ఎన్నిసార్లు చూసినా నా మనసు ఎందుకో అంగీకరించడం లేదు .. తప్పనిసరి పరిస్థితుల్లోనే బికినీ ధరించాల్సి వచ్చింది ” అంటూ చెప్పుకొచ్చింది .

అనుష్క శెట్టి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి . కొంతమంది అనుష్క మాటలను పాజిటివ్గా తీసుకుంటూ ఉంటే మరి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. ప్రెసెంట్ అనుష్క పలు సినిమాలలో బిజీగా ముందుకెళ్తుంది . ప్రభాస్ సైతం పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు..!!