వైసీపీ ఓ వికృత రాజకీయ క్రీడకు తెరలేపింది. ఆ పార్టీ అధినేత జగన్ మాట మాట్లాడితే నా బీసీలు అని కపట ప్రేమ ఒలకబోస్తూ ఉంటారు. వైసీపీలో ఉన్న బీసీలకే ఎంతో తీరని వేదన మిగులుతోంది.. అక్కడ ఉన్న వారు కూడా ఎన్నో అవమానాలు దిగమింగుకుని ఉంటున్నారు. జగన్కు బీసీలు అంటే తన భజన చేసేవారే… మళ్లీ తన పార్టీలో ఉండి… తనపై అసంతృప్తితో ఉన్న బీసీ నేతలు కూడా జగన్ దృష్టిలో బీసీలు కారు.. వారిని కూడా దారుణంగా అణగదొక్కేస్తుంటారని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి పార్థసారథి లాంటి ఎంతోమంది బీసీ నేతలు వాపోతున్న పరిస్థితి.
ఇక ఇతర పార్టీల్లో ఉన్న బీసీలపై జగన్ / వైసీపీ నేతలు ఎంత దారుణమైన ప్రాపగండా ప్రచారం చేస్తున్నారో చెప్పేందుకు గుంటూరు వెస్ట్ టీడీపీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి ఫ్యామిలీ చుట్టూ జరుగుతోన్న ప్రచారమే నిదర్శనం. గుంటూరు వెస్ట్లో మంత్రి విడదల రజనీ గ్రాఫ్ రోజు రోజుకు శరవేగంగా పడిపోతోంది. ఈ విషయాన్ని వైసీపీ వాళ్లే స్వయంగా ఒప్పుకుంటున్నారు. చిలకలూరిపేటలో తీవ్రమైన వ్యతిరేకతతో ఆమె చిత్తుగా ఓడిపోతుందన్న నివేదికలు జగన్ దగ్గర కుప్పలు తెప్పలుగా ఉండడంతోనే ఆమెను వెస్ట్ నియోజకవర్గానికి మార్చారు.
ఇక్కడ కూడా కులాల డీవియేషన్ తీసుకువచ్చి లబ్ధి పొందాలని వైసీపీ వాళ్లు వేసిన స్కెచ్ అట్టర్ ప్లాప్ అయ్యింది. పిడుగురాళ్ల మాధవి ఉన్నత విద్యావంతురాలు కావడంతో పాటు బీసీల్లో రజక సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పాటు ఆమెకు కూడా వాగ్దాటి ఉండడంతో పాటు క్లీన్ ఇమేజ్తో ఎన్నికల బరిలోకి ఫస్ట్ టైం దిగుతుండడంతో రజనీకి ఆమెపై విమర్శలు చేసేందుకు సాకులు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఏం సాకులు లేక.. తనపై తీవ్ర వ్యతిరేకత ఉండడంతో బీసీ మహిళా బిడ్డపై కట్టుకథలు అల్లే ప్రచారం వైసీపీ వాళ్లు మొదలు పెట్టేసినట్టే కనిపిస్తోంది.
మాధవి ఫ్యామిలీ ఎంతో ఉన్నత విలువలు కలిగిన కుటుంబం. వాళ్ల తండ్రి జడ్జ్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఇటు మాధవి భర్త గల్లా రామచంద్రరావు కూడా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, రాజకీయాల్లోకి వచ్చాకో పదవుల కోసమో వీరు ప్రజాసేవ అనేది మొదలు పెట్టలేదు.. అసలు రాజకీయ ఆలోచన లేని సమయంలో కూడా వాళ్లు ప్రజలకు సేవ చేశారు. తమ హాస్పటల్స్ ద్వారా ఎన్నో వైద్య సేవలు, పేదలకు ఉచిత వైద్యం, మరెంతో మందికి తక్కువ రేటుకే వైద్య సేవలు.. వారి హాస్పటల్స్లో ఎవరు ఎంత ఇస్తే అంతే పేదవాళ్లు బిల్లు మొత్తం కట్టలేకపోతే ఎంత ఇస్తే అంతే తీసుకుంటారన్న పేరుంది.
టిక్కెట్ ఎనౌన్స్ అయ్యాక జిల్లాలో ఉన్న అందరు నాయకుల మద్దతు కూడగట్టడమే కాకుండా
ఒక కార్పోరేట్ వ్యక్తి విడదల రజనీ వచ్చి రాజకీయాలను వ్యాపారం చేస్తుంటే కేవలం సేవా భావంతో అన్ని వర్గాలను ఆకట్టుకుంటూ ఓ బలహీన వర్గాలకు చెందిన మహిళగా మంచి పేరుతెచ్చుకున్నారు. బలహీన వర్గాల మహిళగా ముందుకు వెళుతుంటే వైసీపీ పెయిడ్ బ్యాచ్ కావాలని కుట్రలకు తెరలేపుతోంది.