అప్పుడు సావిత్రి, విజయ నిర్మల .. ఇప్పుడు సాయిపల్లవి.. సంచలన నిర్ణయం..!

ఇండస్ట్రీలో కేవలం హీరోయిన్స్ అంటే అందాలను ఆరబోయడం చక్కగా నటించడం డాన్స్ చేయడం వరకే అనుకుంటూ ఉంటారు అందరూ . కానీ హీరోయిన్స్ లో హిడెన్ టాలెంట్స్ చాలా ఉంటాయి అంటూ సావిత్రి – విజయనిర్మల గారు ప్రూవ్ చేశారు . అయితే ఇప్పుడు అదే లిస్టులోకి యాడ్ అవ్వబోతుంది అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ సాయి పల్లవి . మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి తెలుగులో ఫిదా సినిమా ద్వారా బాగా క్రేజ్ సంపాదించుకుంది .

అంతేకాదు లేడీ పవర్ స్టార్ అంటూ కూడా ట్యాగ్ క్రియేట్ చేసుకుంది. ప్రజెంట్ పలు సినిమాలలో బిజీబిజీగా నటిస్తున్న సాయి పల్లవి తనలోని కొత్త టాలెంట్ బయట పెట్టబోతుంది అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . ఇన్నాళ్లు సాయి పల్లవి అంటే కేవలం బాగా డాన్స్ చేస్తుంది .. పద్ధతిగా నటిస్తుంది.. చక్కగా మాట్లాడుతుంది అని మాత్రమే అనుకునేవాళ్ళు . కానీ సాయి పల్లవి డైరెక్టర్ గా మారబోతుంది అని తెలిసి షాక్ అయిపోతున్నారు .

సాయి పల్లవి ప్రెసెంట్ రైటర్ గా మారిందట . ప్రస్తుతం ఆమె ఓ స్క్రిప్ట్ కూడా రాసుకుంటుందట . త్వరలోనే ఆ సినిమా కి డైరెక్టర్ గా మారబోతుందట . అందుకోసం అద్భుతమైన ఇంటెన్స్ స్క్రిప్ట్ ని రెడీ చేస్తుందని తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఇదే వార్త బాగా వైరల్ గా మారింది. ప్రజెంట్ హీరోయిన్ సాయి పల్లవి నాగచైతన్యతో తండేల్ అనే సినిమా షూట్ లో బిజీగా ఉంది. అంతేకాదు కోలీవుడ్ లో ఒక సినిమా బాలీవుడ్ లో రెండు సినిమాలతో బిజీబిజీగా ముందుకు దూసుకెళ్లిపోతుంది సాయి పల్లవి..!!