కొన్నాళ్లు పాటు ఎవరి కంటికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోతున్న సాయి పల్లవి.. ఏమైందంటే..?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ గా మారింది . హీరోయిన్ సాయి పల్లవి ఎవరికీ కనిపించకుండా దూరంగా వెళ్లిపోతుందా ..? అంటే ఆవుననే చెప్పాలి. దానికి కారణం ఆమె బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణం సినిమాలో నటించడమే కారణం అంటూ ఓ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది. మనకు తెలిసిందే రామాయణం తెరకెక్కించడం చాలా చాలా కష్టమైన మేటర్ . కానీ కొంతమంది డైరెక్టర్ అది చాలా గోల్గా తీసుకుంటున్నారు.

రీసెంట్ గా బాలీవుడ్ డైరెక్టర్ నితేష్ తివారి రామాయణం తెరకెక్కించడానికి సిద్ధపడ్డారు . ఆయన తెరకెక్కించే రామాయణంలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ – సీత పాత్రలో న్యాచురల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి కనిపించబోతుంది . గతంలో ప్రభాస్ తో ఆది పురుష్.. సినిమా తీసి దర్శకుడు ఓం రావత్ విమర్శల పాలయ్యాడు అని తెలిసి కూడా ఈ డైరెక్టర్ పెద్ద సాహసమే చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో ఆర్టిస్ట్ లుక్ రివిల్ కాకుండా ఉండాలి అంటే కచ్చితంగా తాను చెప్పినంత టైం వరకు ఆ ఆర్టిస్టులు బయట మీడియాకి బయట ప్రపంచానికి అస్సలు కనిపించకూడదట ..కేవలం కుటుంబ సభ్యుల వరకు మాత్రమే ఆ లుక్స్ చూసేలా బయట ప్రపంచానికి మొత్తం కొత్తగా అ లుక్స్ కనిపించేలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట . ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ సాయి పల్లవిలను కొన్నాళ్లపాటు ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోమంటూ సజెస్ట్ చేశారట.

పబ్లిక్ ఈవెంట్స్ ప్రైవేట్ ఈవెంట్స్ లో అసలు పాల్గొనకూడదు అంటూ కండిషన్ కూడా పెట్టారట . వీటన్నిటికీ సాయి పల్లవి రన్బీర్ కపూర్ కూడా ఒప్పుకున్నారు అంటూ తెలుస్తుంది . అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీని ఏప్రిల్ నెలలో శ్రీరామ నవమి సందర్భంగా లాంచ్ చేయాలి అని మేకర్స్ ఆలోచిస్తున్నారట . సోషల్ మీడియాలో ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!