కీర్తి సురేష్ ఒక్కగాని ఒక్క పాన్ ఇండియా ఆఫర్ ని దొబ్బేసిన మృణాల్.. మహానటికి కోలుకోలేని షాక్..!

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ కోసం రాసుకున్న కథ మరొక హీరోయిన్ చేస్తూ ఉండడం సర్వసాధారణమే .. అయితే ఒక హీరోయిన్ ఆ సినిమాకు సైన్ చేసి కొన్ని కారణాల చేత ఆ హీరోయిన్ ఆ సినిమా నుంచి తీసేసి మరొక హీరోయిన్ ని సినిమాలో పెట్టుకోవడం అది కూడా ఆమెకి ఆ హీరోయిన్ కి అస్సలు కుదరని పొజిషన్లో చేయడం.. నిజంగా అది ఓ బిగ్ రిస్క్ అని చెప్పాలి . అలాంటి రిస్క్ చేస్తున్నారు డైరెక్టర్ అట్లీ .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రెసెంట్ పుష్ప సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా అయిపోగానే అట్లీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్గా పూజ హెగ్డే సెలక్ట్ అయిందట. మరొక హీరోయిన్గా కీర్తి సురేష్ ని ఫైనలైజ్ చేసుకున్నారట .

కానీ లాస్ట్ మూమెంట్లో మూవీ మేకర్స్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ అయితే బాగుంటుంది అంటూ ఫిక్స్ అయ్యారట . దీంతో కీర్తి సురేష్ క్రేజీ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . కీర్తి సురేష్ కి కోలుకోవాలని షాక్ ఇచ్చింది మృణాల్ ఠాకూర్ అంటూ కొందరు ట్రోల్ చేస్తున్నారు.

మృణాల్ ఠాకూర్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది . ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలోను అమ్మడు నటిస్తుంది. అదే విధంగా హనురాఘవ పూడి దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలోను అమ్మడు సెలెక్ట్ అయిందట . అంతేకాకుండా ఎన్టీఆర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లోను మృణాల్ ఠాకూర్ సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!