పోయి పోయి ఆ డైరెక్టర్ తో సినిమానా..? గోపీచంద్ బిగ్ రిస్క్ చేస్తున్నాడే..!!

గోపీచంద్ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోలలో ఒకరుగా బాగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఒకప్పుడు గోపీచంద్ సినిమాలు ఎలా హిట్ కొట్టయో మనకు తెలిసినదే. మరీ ముఖ్యంగా గోపీచంద్ నటించిన జయం సినిమా అభిమానులు ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోలేరు . ఇప్పటికే ఈ సినిమా టీవీలో వస్తే అభిమానులు కళ్ళు ఆర్పకుండా చూస్తారు. అంతలా ఈ సినిమాలో ఆయన పర్ఫామెన్స్ ఉంటుంది.

కాగా మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఆ తర్వాత విలన్ గా తన సత్తా చూపించాడు . హీరోగా కంటే విలన్ గానే ఆయన కటౌట్ అదిరిపోయింది . అందుకే జనాలు విలన్ గా ఆయనను ఎంకరేజ్ చేశారు . కానీ మళ్ళీ హీరోగా మారాలి అనుకున్నాడు గోపీచంద్ . ఈసారి హీరో పాత్రని చేయడానికి బాగా ట్రై చేశాడు . కానీ ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడం ఆయన ఫ్యాన్స్ కు బాధగా అనిపించింది.

రీసెంట్ గా వచ్చిన భీమా కూడా గోపీచంద్ ని నిరాశపరిధింది. గోఫీ చంద్ రాధే శ్యామ్ డైరెక్టర్ రాధాకృష్ణకు అవకాశం ఇచ్చినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించబోతుందట . గోపీచంద్ హీరోగా రాధాకృష్ణ డైరెక్టర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుందట . ఆల్రెడీ రాధే శ్యామ్ తో భారీ డిజాస్టర్ అందుకున్నాడు రాధాకృష్ణ . అది తెలిసి కూడా గోపీచంద్ ఎలా అవకాశం ఇస్తాడు ..? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు . రాధే శ్యామ్ సినిమా ఫ్లాప్ అయినప్పుడు డైరెక్టర్ రాధాకృష్ణను బాగా ట్రోల్ చేశారు రెబెల్ అభిమానులు . మరోసారి సినిమా ఫ్లాప్ అయితే ఇక రాధాకృష్ణకు సినీ కెరియర్ ఉండదు ఇదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు జనాలు . చూద్దాం మరి ఈ డైరెక్టర్ ఎలా ఈ సినిమాతో బయట పడతాడో..??