కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇటీవల జపాన్ తో షారుక్ ఖాన్ కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బన్నీతో మరో సినిమా చేయడానికి అట్లీ సిద్ధమయ్యాడు. ఈ సినిమాకు అట్లి తీసుకుంటున్నా రికార్డ్ బ్రేకింగ్ రెమ్యూనరేషన్ పై నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకి ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాతో బన్నీపాన్ ఇండియా లెవెల్ లోనే కాదు.. గ్లోబల్ లెవెల్లో మార్కెట్లో టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో బన్నీ మేనరిజం, పాటలు అన్ని ఇతర దేశాలను కూడా ఆకట్టుకోవడంతో.. ఈ సినిమా సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
అదే రేంజ్ లో డైరెక్టర్ సుకుమార్ సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఇదిలా ఉంటే బన్ని నెక్స్ట్ మూవీ పై పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఈ సినిమా తర్వాత నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బన్ని. కాగా మొదట త్రివిక్రమ్ తో సినిమాకు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. దీంతో పాటు యానిమల్తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగతో సినిమాను ప్రకటించాడు. అలాగే బోయపాటితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం తమిళ్ స్టార్ట్ డైరెక్టర్ అట్లీతో సినిమాకు బన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. నెక్స్ట్ మూవీ అట్లీతోనే ఉండబోతుందని.. తర్వాతే మిగతా సినిమాలు ఉంటాయని వార్తలు వైరల్ అవుతున్నాయి. అటు ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలోను ఇదే వార్త చెక్కర్లు కొడుతుంది.
దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయిందని.. ఫైనల్ స్టేజ్లో ఉందని సమాచారం. ఇది ఇలా ఉంటే జవాన్ సినిమాతో అట్లీ తన సత్తా చాటాడు. దీంతో ఇప్పుడు మార్కెట్లో అట్లీకి ఫుల్గా డిమాండ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే ఆయన రెమ్యూనరేషన్ కూడా డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. బన్నీతో అట్లీ చేయబోయే నెక్స్ట్ సినిమాకు రికార్డ్ రేంజ్లో రెమ్యూనరేషన్ను ఛార్జ్ చేస్తున్నాడట. ఏకంగా రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే కోలీవుడ్లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న మొదటి డైరెక్టర్ అట్లీనే అవుతాడు. మరి ఇతర డైరెక్టర్స్ కూడా ఇప్పటివరకు ఆ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోలేదు. శంకర్ సహా.. మిగతా వారంతా రూ.60 కోట్ల లోపే రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక బన్నీ – అట్లి కాంబోలో వస్తున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. ఈ మూవీ పుష్ప 2 రిలీజ్ తర్వాత ప్రారంభమవుతుందట.