చిరంజీవి-పవన్ కళ్యాణ్ అన్నం తినాలి అంటే ఆ ఐటెం ఉండాల్సిందే.. కంచాని కూడా నాకేస్తారు..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతూ ఉంటాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రామ్ చరణ్ కి సంబంధించిన ప్రతి వార్త బాగా హైలైట్ గా మారింది. ఆర్ఆర్ఆర్ లాంటి బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు చరణ్. రీసెంట్ గా ఉమెన్స్ డే సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ ఓ ప్రముఖ జాతీయ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది .

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ – చిరంజీవి ఆహారపు అలవాట్లు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది . చాలామంది ఇంట్లో బాగా మొండి చేస్తూ ఉంటారు . ఆ ఫుడ్ కావాలి ఈ ఫుడ్ కావాలి అది ఉంటేనే తింటాను ఇది ఉంటే తింటాను ..అని అయితే చిరంజీవి మాత్రం అలా ఎప్పుడూ చేయుట.. ఏ ఫుడ్ అయినా సరే ఇష్టంగా తింటాడట . మరి ముఖ్యంగా చిరంజీవికి అమ్మ చేతి ఫుడ్ అంటే బాగా ఇష్టమట .

పెళ్లయిన కొత్తల్లో సురేఖకు అస్సలు వంట వచ్చేది కాదట. కానీ చిరంజీవికి ఏమో సురేఖ చేతి వంట తినాలి అని కోరిక ఉండేదట. ఆ టైంలో సురేఖ ఉప్మా చేసిందట . ఆ ఉప్మా రాయిలా వచ్చిందట . ఆ తర్వాత వంట జోలికి పోకుండా కామ్ గా అయిపోయిందట సురేఖ . దీంతో చిరంజీవినే ఆమెకు ఉప్మా చేయడం నేర్పించారట . ఇప్పుడు ఆమె ఉప్మా చేస్తే ఇంట్లో అందరూ లొట్టలు వేసుకొని తింటారు అంటూ చెప్పుకు వచ్చింది . అంతేకాదు పవన్ కళ్యాణ్ కూడా ఫుడ్ విషయంలో ఏ మాత్రం మొండి చేయడని .. ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోతాడని ..చెప్పుకు వచ్చింది. కానీ ఖచ్చితంగా వైట్ రైస్ అయితే ఉండాలి అంటూ చెప్పుకు వచ్చింది . ప్రజెంట్ సురేఖ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయ్..!!