డ్రగ్స్ కేసు వల్లే అమెరికాకు వెళ్లిపోయా.. సురేఖ వాణి షాకింగ్ కామెంట్స్ వైరల్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో యాక్ట్రెస్ సురేఖ వాణి ఒకరు. గతంలో ఏడాదికి కనీసం 5 నుంచి 6 సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. దాదాపు అందరూ స్టార్ హీరోల సినిమాల్లోనే నటించింది. అక్కగా, అమ్మగా, వదినగా ఇలా ఎన్నో క్యారెక్టర్ లో నటించి మెప్పించిన సురేఖ వాణి.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. అయినా కూడా ఆమె ఖరీదైన కారు కొనుక్కుని విలాసవంతంగా జీవితం గడపడంపై ఎన్నో విమర్శలు వైరల్ గా మారాయి. దానిపై సురేఖవాణి తాజాగా ఇంటర్వ్యూలో స్పందించింది. ఆమె మాట్లాడుతూ కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో కూడా ఆమె పేరు వినిపించడం పై క్లారిటీ ఇచ్చేసింది.

సురేఖ వాణి మాట్లాడుతూ నాకు ఇప్పటివరకు సొంత ఇల్లు లేదని.. తమకున్న పాత బియమ్‌డ‌బ్ల్యూ అమ్మేసి సెకండ్ హ్యాండ్‌లో ఈఎంఐ లో రేంజ్ రోవర్ కార్‌ కొన్నానంటూ వివరించింది. సెకండ్ మ్యారేజ్ చేసుకోబోతున్నానంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపించాయి. కానీ రిలేషన్ షిప్ అంటే నాకు భయమేస్తుంది. వాటిపై అసలు నమ్మకం లేదు. ఎప్పుడు దేవాలయాలకు వెళ్తూనే ఉంటా అలా వెళ్ళిన ప్రతిసారి నాకు ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వాలని.. ఆ దేవుని కోరుకుంటా. నా వాళ్ళని చూసుకునే ధైర్యాన్ని ఇవ్వమని అడుగుతా. సీనియర్ హీరోయిన్ల రీ ఎంట్రీ వల్ల కూడా అవకాశాలు తగ్గిపోయాయి అంటూ సురేఖ వాణి చెప్పుకొచ్చింది. కేపీ చౌదరి డ్రగ్స్ కేజ్ గురించి మాట్లాడుతూ.. అత‌ను అందరి కామన్ గా ఉన్న ఒక ఫ్రెండ్ అని.. మేము మామూలుగా పార్టీలో అందరితో కలిసే వాళ్ళం.. తన ఫోన్లో నా ఫోటోలు కంటే వేరే ఆర్టిస్టుల ఫోటోలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి.

దాదాపు 300 మంది ఆర్టిస్టుల ఫోటోలు ఉంటే ముగ్గురు ఫోటోలు మాత్రమే బయటకి తీశారు. అందులో నా ఫోటో కూడా బయటకి వచ్చింది. ఫోటోలు వేయడం వల్ల అందరూ నాన్న రకాలుగా మాట్లాడారు. దాంతో నేను మానసిక ఒత్తిడికి గురయ్యా. ఆ సమయంలో నాకు ఎవరో సపోర్ట్ లేరు. నా కూతురుతో కలిసి కూర్చొని ఏడ్చేదాన్ని. ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇవ్వాలనుకున్నా.. కానీ ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని చాలామంది సజెస్ట్ చేశారు. అయితే ఆ బాధను తట్టుకోలేకపోయా.. అక్కడ ఉండలేకపోయా. మనశాంతి కోసం అమెరికాకు వెళ్ళిపోయా. అయితే డ్రగ్స్ కేసు వల్లే అమెరికాకు పారిపోయిందంటూ వార్తలు పుట్టించారు. కానీ ఆ ట్రిప్ వల్ల నేను ఈ ఘటన నుంచి బయటకు రాగలిగా అంటూ సురేఖవాణి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సురేఖ వాణి చేసిన ఈ కామెంట్స్ నెటింట వైరల్ గా మారాయి.