వావ్ : జూనియర్ ఎన్టీఆర్, సాయి పల్లవిల మధ్య ఇన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయా.. అవేంటో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలను లైన్లో పెట్టుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్‌లో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాను అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మొదట ఏప్రిల్ 5 న సినిమా రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసినా.. ఏవో కారణాలతో ఆరు నెలలు వాయిదా తరువాత ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇక ఇప్పటికే సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా దసరా కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది. లాంగ్ వీకెండ్‌ను కూడా ఈ సినిమా సద్వినియోగం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా తొమ్మిది భాషల్లో అనర్గ‌ళంగా మాట్లాడగలడని సంగతి అందరికీ తెలుసు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఉర్దూ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో తారక్ మాట్లాడతాడు. ఈ భాషలతో పాటు మరికొన్ని భాషలు తారక్‌కు వచ్చని సమాచారం. ఇక టాలీవుడ్లో స్టార్ బ్యూటీ గా దూసుకుపోతున్న సాయి పల్లవి కూడా జూనియర్ ఎన్టీఆర్ లానే మల్టీ టాలెంటెడ్ అని తెలుస్తుంది. ఈమె కూడా ఏకంగా ఎనిమిది భాషల్లో అనర్‌గ‌ళంగా మాట్లాడగలదట. ఎక్కువ భాష‌లు మాట్లాడే విషయంలోనే కాదు.. జూనియర్ ఎన్టీఆర్, సాయి పల్లవి మరికొన్ని విషయాల్లో కూడా సేమ్ టు సేమ్ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. డ్యాన్స్ విషయంలో కూడా ఎన్టీఆర్, సాయి పల్లవి ఆద‌రగొడతారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌ను అభిమానులు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఆయినా విరుద్ధరి కాంబోలో సినిమా వస్తే బాగుండ‌ని ఆశపడుతున్నారు.

ఇక వీరిద్దరూ సింప్లిసిటీనే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. స్టోరి ఎంపిక విష‌యంలో క‌థ‌కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు అయితేనే ఆ సినిమాల్లో నటిస్తూ ఉంటారు. ఇలా ఈ పై విషయాలు అన్నిటిలోనూ జూనియర్ ఎన్టీఆర్, సాయి పల్లవి సేమ్ టు సేమ్. కాగా ప్రస్తుతం వీరిద్దరిలో ఎన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయని తెలియడంతో ప్రేక్షకులంతా ఆశ్చర్యపోతున్నారు. నిజంగానే వీళ్ళిద్దరూ సౌత్ ఇండస్ట్రీలో ఉండడం సౌత్ సినిమాలకు చాలా ప్లస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్ ఈ ఏడాది దేవరతో, 2025 లో వార్ 2 సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రానున్నాడు. ఈ సినిమాల తర్వాత ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్‌తో తన 31వ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అలాగే ప్రస్తుతం సాయి పల్లవి.. నాగచైతన్య తండేల్‌ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరో మలయాళ సినిమాలో ఈమె నటిస్తుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.