నా సినిమాల్లో హీరోలను అనాధలుగా చూపించడానికి కారణం అదే.. పూరి జగన్నాథ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోలు అందరికీ ఒకప్పుడు వరుస సక్సెస్ లో అందిస్తూ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. పూరీ సినిమాలే కాదు.. రియల్ లైఫ్‌లోను ఆయన మాట్లాడే మాటలకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. పూరి మాట్లాడే ప్రతి మాటలోను ఎంతో అర్థముంటుంది.. పూరి జగన్నాథ్ తెరకెక్కించే ప్రతి సినిమాలోని కామన్ గా ఒక పాయింట్ ర‌న్ అవుతుంది. కెరీర్ స్టార్టింగ్ సినిమా నుంచి డబ్బుల్‌ ఇస్మార్ట్ వరకు దాదాపు 90% సినిమాల్లో కచ్చితంగా ఓ కామన్ పాయింట్ ఉంది. అదేంటంటే తండ్రి లేదా తల్లి చనిపోవడం. లేదా తండ్రి వదిలేయడం లాంటి కామన్ పాయింట్స్ ఉంటాయి. ఒక బ్రోకెన్ ఫ్యామిలీకి చెందిన క్యారెక్టర్ గా హీరో.. లేదా హీరోయిన్ లీడ్ చూపిస్తూ ఉంటాడు. ఉదాహరణకు టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అనాధ‌గా కనిపిస్తాడు.

అలాగే అమ్మ, నాన్న ఓ తమిళమ్మాయి మూవీలో తండ్రి వదిలేసిన కొడుకుగా రవితేజ నటించాడు. ఇలా దాదాపు పూరి జగన్నాథ్ ద‌ర్శక‌త్వంలో వ‌చ్చిన‌ అన్ని సినిమాల్లో హీరో. లేదా హీరోయిన్ కు కుటుంభానికి సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది ఉండడం కామన్ గా జరుగుతుంది. గ‌తంలో పూరీ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు. సుకుమార్ తో జరిగిన ఓ చిన్ని చిట్ చాట్‌లో భాగంగా దీనిపై స్పందించిన ఆయన మాట్లాడుతూ నాకు సంబంధించినంత వరకు అన్ని సవ్యంగా ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చే పిల్లలకు ఏ విషయాలపై సరైన అవగాహన ఉండదు. తల్లిదండ్రులు సంపాదించి పెడితే వాళ్లు తిని ఎలా సంపాదించాలో మర్చిపోతూ ఉంటారు. కానీ తండ్రి చనిపోయిన ఒక పిల్లాడు ఎలా బతకాలో నేర్చుకుంటాడు. తల్లి చనిపోయిన ఇంట్లో ఎలా జీవించాలనే విషయం తెలుస్తుంది. అలాంటి ఇళ్ళ నుంచి వచ్చిన పిల్లలు కూడా స్ట్రాంగ్ గా ఉంటారు. అదే విషయాన్ని నా సినిమాల ద్వారా చూపించే ప్రయత్నం చేస్తా.

మనం ఎంతో కష్టపడి పిల్లలకు తిండి పెడితాం. కానీ పిల్లలకు కష్ట విలువ తెలియకుండా పెంచుతాం. అలా చాలామంది గొప్ప వాళ్ళ పిల్లలు ఎందుకు పనికి రాకుండా అవుతున్నారు. కానీ స్ట్రగుల్స్ ఫేస్ చేసిన పిల్లలు మాత్రమే బయట ప్రపంచంలో ఎలా బ్రతకాలో తెలుసుకుంటున్నారు. వాళ‌ని అడవిలో వదిలేసిన కూడా బతికి ఇంటికి రాగలడు. అలా నా సినిమాలో క్యారెక్టర్స్ కి కూడా ఓ స్ట్రగుల్ క్రియేట్ చేసి.. ఆ స్ట్రగుల్ నుంచి హీరోయిజం ఎలా పుడుతుందో అనేది చూపిస్తా. అందుకే సినిమాలు బాగా నడుస్తాయి అని నేను నమ్ముతా.. అంటూ పూరి జగన్నాథ్ వివరించాడు. ఇదే విషయాన్ని రియల్ లైఫ్ లో కూడా అప్లై చేసుకుంటే బాగుంటుందని.. ఎవరో పెడితే తిని కూర్చుందాం అని కాకుండా.. తమ కష్టంతో.. సంపాదనతో పదిమందిని సాకితే ఆ తృప్తి ఎలా ఉంటుందో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పకొచ్చాడు.