మధురలో శ్రీకృష్ణ ఆలయాన్ని కూల్చి మసీదును నిర్మించారా.. ఏఎస్ఐ సర్వేలో బయటపడ్డ షాకింగ్ నిజలు ఇవే..

ఇటీవల అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగిన సంఘటన తెలిసిందే. అయితే ఈ రామ మందిరం నిర్మాణం కోసం హిందువులు ఎన్నో పోరాటాలను చేయవలసి వచ్చింది. ఇక తాజాగా హిందువుల విజయం సాధించడంతో.. ఇదేవిధంగా పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను కూల్చి మసీదులు నిర్మించిన వాటిపై కోర్టులో కేసులు నమోదయ్యాయి.

ఇప్పటికే వారణాసిలో జ్ఞానవాసి మసీదు కింద భారీ హిందూ ఆలయం ఉండేదని.. దాన్ని కూల్చే మసీదును కట్టారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్ధారించింది. ఇక గ‌తంలో మధురలోను సాహి ఈద్గా మసీదు ఉన్న ప్రాంతంలో గతంలో శ్రీకృష్ణుని దేవాలయం ఉండేదని.. వాదన వినిపిస్తుంది.

ఇక మద్రాస్ శ్రీకృష్ణ జన్మస్థలం అని అందరికీ తెలుసు. అయితే ఆయన జన్మస్థలంలోనే శ్రీకృష్ణుడు దేవాలయాన్ని కూల్చేసి ఔరంగజేబు అక్కడ ఈద్గా మసీదును నిర్మించాడని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది.