సినీ ప్రియులకు దిమ్మతిరిగే బంపర్ ఆఫర్ ఇచ్చిన మైత్రి మూవీ మేకర్స్..!

హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ మూవీ విడుదలై నెల దాటినప్పటికీ క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గడం లేదని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది.

ఇక దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించడంతో మైత్రి మూవీ మేకర్స్ ఆనందంలో ఉన్నారు. ఇక తాజాగా హనుమాన్ మూవీ మేకర్స్ సినీ ప్రియులకు బంపర్ ఆఫర్ ఒకటి ఇచ్చారు. నైజాం థియేటర్లో టికెట్ ధరను తగ్గిస్తున్నట్లు వెల్లడించారు.

సింగిల్ స్క్రీన్ టికెట్ రూ. 175ది 100 కి తగ్గించారు మైత్రి మూవీ మేకర్స్. అదేవిధంగా మల్టీప్లెక్స్ లో రూ. 295 ఉన్న టికెట్ను రూ. 150కి తగ్గించారు. ఇక ఈ ధరలు ఫిబ్రవరి 6 నుంచి 23 వరకు అందుబాటులో ఉండనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ఓ పోస్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.