మనలో చాలామంది పొట్టు చుట్టు కొవ్వు సమస్యతో బాధపడుతూ ఉంటారు. శరీరం మొత్తం స్లిమ్గా ఉన్న పొట్ట మాత్రం బాగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా గంటలు తరబడి కూర్చొని పని చేసే ఉద్యోగుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గంటల తరబడి సిస్టం ముందు కూర్చొని ఉండడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, కడుపు నిండటానికి ఏ ఆహారమైనా తీసుకుంటూ ఉండడం.. శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి, మధ్యపానం ఇలాంటి కారణాలతో పొట్ట చుట్టూ కొవ్వు భారీగా పెరిగిపోతూ ఉంటుంది. దీంతో ఊబకాయా సమస్య బారిన పడుతూ ఉంటారు.
ఈ కొవ్వు కరిగించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి కొన్నిసార్లు ఫలించవు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఈ మ్యాజికల్ వాటర్ మీకు చాలా సహాయపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ వాటర్ ను తాగితే.. నెల రోజుల్లోనే పొట్ట కొవ్వు కరిగిపోతుంది. అయితే ఈ మ్యాజికల్ వాటర్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక నిమ్మ పండును తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత.. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకోవాలి.
వాటర్ బాగా హీట్ అయ్యాక అందులో కట్ చేసిన నిమ్మ పండు ముక్కలతో పాటు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వన్ టేబుల్ స్పూన్ సోంపు వేసి 15 నిమిషాల పాటు సిమ్లో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని ఫిల్టర్ చేసుకుని తాగితే సరిపోతుంది. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తీసుకోవడం వల్ల పొట్ట చుట్టూ ఉండే కొవ్వు ఐస్ ముక్కల కరిగిపోతుంది. బాన పొట్ట ఫ్లాట్ గా మారి నాజుక్కుగా కనిపిస్తారు. అలాగే రోజు ఈ వాటర్ తాగడం వల్ల అధిక బరువు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. కనుక ఈ మ్యాజికల్ వాటర్ రెగ్యులర్గా తాగేందుకు ప్రయత్నించండి. కచ్చితంగా మంచి ఫలితం లభిస్తుంది.