సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్..ఇండస్ట్రీ తలరాతనే మార్చేసే నిర్ణయం తీసుకున్న తివ్రిక్రమ్ ..తిక్క రేగితే ఇంతే..!!

త్రివిక్రమ్ శ్రీనివాసరావు .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరుని ఎలా ట్రోల్ చేశారో మనం చూసాం . మరీ ముఖ్యంగా దారుణాతి దారుణంగా ఆయనను రకరకాల మీమ్ తో ఇబ్బందికర పరిస్థితిని క్రియేట్ చేశారు . దినంతటికీ కారణం గుంటూరు కారం. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే సినిమా చూసిన తర్వాత మహేష్ బాబు అభిమానుల సైతం ఈ సినిమాపై నెగిటివ్గా కామెంట్ చేశారు.

కొంతమంది దారుణంగా ట్రోల్ చేశారు . అయితే ఆ ట్రోలింగ్ బాధలు తట్టుకోలేక త్రివిక్రమ్ సినిమా ఇండస్ట్రీకి దూరం అవ్వాలి అనే డిసైడ్ అయ్యారట . పూర్తిగా డైరెక్షన్ కి గుడ్ బై చెప్పకుండా కొన్నాళ్లపాటు డైరెక్షన్ కు బ్రేక్ చెప్పి సినిమాలను నిర్మించే పనిలో బిజీగా ఉన్నాడట. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఆల్రెడీ అల్లు అర్జున్ తో ఒక సినిమాకి కమిట్ అయ్యాడు .

అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశాడు . మరి దీని పరిస్థితి ఏంటి ..?? అంటున్నారు జనాలు . త్రివిక్రమ్ అభిమానులు మాత్రం ఆయనకు తిక్క రేగితే ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు అంటూ ఫైర్ అయిపోతున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో జరిగే ట్రోలింగ్స్ ని బాగా సీరియస్ గా తీసుకుంటున్నారు స్టార్స్ అని చెప్పడానికి ఇది ఒక్క బెస్ట్ ఎగ్జాంపుల్ అని అంటున్నారు జనాలు..!!