టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి పరిచయం అవసరంలేదు. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ లాంటి అగ్ర హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న టైంలో ప్రేమ, పెళ్లి, విడాకులు అంటూ ఆమె జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి నాలుగేళ్లకు విడాకులు తీసుకోవడంతో సామ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయింది.
ముఖ్యంగా ఆమెపై భారీ నెగిటివిటీ, విమర్శలు వచ్చాయి. అయినా వాటన్నింటిని పట్టించుకోకుండా మళ్లీ తన కెరీర్ పై ఫోకస్ పెట్టిన సామ్.. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఓ వైపు మయో సైటీస్ వ్యాధితో బాధపడుతూనే.. మరొకవైపు వరుసగా నటించి మెప్పించింది. ఇకపోతే ప్రస్తుతం అ సమస్యలన్నింటిని ఎదుర్కొని మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో ఉంది సమంత. ఈ క్రమంలో రీఎంట్రీ పై హింట్ ఇచ్చింది. దీంతో సామ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు నెట్టింట యాక్టివ్గా ఉండే సమంత చాలా కాలం తర్వాత ప్రేమ గురించి ఓ పోస్ట్ షేర్ చేసుకుంది.
కొన్ని లేటెస్ట్ ఫోటోస్ ని షేర్ చేస్తూ ఆసక్తికర విషయాన్ని వివరించింది. తాజాగా సామ్ తన సొంతూరు చెన్నై వెళ్లింది. అక్కడే ఉన్న సత్యభామ యూనివర్సిటీలో ఒక ఈవెంట్లో సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. సొంతూరిలో దొరికే ప్రేమ ఎప్పుడూ స్పెషల్ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట చెక్కర్లు కొడుతుంది. ఇక శ్యామ్ చివరిగా విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా కు ఊహించిన రేంజ్ లో సక్సెస్ అందలేదు. అలాగే సమంత బాలీవుడ్ లో నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఇందులో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటించాడు.