టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో.. సూపర్ స్టార్ మహేష్ హీరోగా తన 29వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అంటూ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. అయితే ఇంకా ఈ సినిమా సెట్స్ పైకి రాకముందే.. సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్డేట్ నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ తెగ చక్కెరలు కొడుతుంది.
రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా కావడంతో.. ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అంచనాలను రెట్టింపు చేసేందుకు సినిమాపై మరింత హైప్ తెచ్చేందుకు రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశాడట. ఈ మూవీ కోసం జక్కన్న హాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఒకరిని రంగంలోకి దించుతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు..? అసలు మేటర్ ఏంటో ఒకసారి చూద్దాం. సూపర్ స్టార్ తో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలకు హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరున్ను తీసుకురావాలని జక్కన్న మాస్టర్ ప్లాన్ వేసాడట.
అంతేకాదు ప్రమోషన్స్ లో కూడా జేమ్స్ సహాయం తీసుకుంటాడట రాజమౌళి. ఈ నేపథ్యంలో నేషనల్ లెవెల్ లో ప్రెస్ మీట్ పెట్టి జేమ్స్ తో కొన్ని ఆసక్తికర విషయాలను రాజమౌళి మాట్లాడిస్తాడని.. వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు కానీ ఈ విషయం ప్రస్తుతం నెటింట వైరల్ అవడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు.. సాధారణ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. మహేష్ సినిమాతో ఆర్ఆర్ఆర్, బాహుబలి రేంజ్ మించిపోయే బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని.. జక్కన్న తన పాన్ వరల్డ్ సినిమా హైప్ కోసం వేసిన మాస్టర్ స్కెచ్ అదుర్స్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.