ఇటీవల పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో భారీ పాపులారిటీని దక్కించుకుంది డస్కి బ్యూటీ శ్రియ రెడ్డి. ఈ సినిమాలో రాధా రమా అనే పవర్ఫుల్ క్యారెక్టర్లో నటించి మెప్పించింది. ఆమె గెటప్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఒక్కసారిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకున్న శ్రీయ రెడ్డి ఈ సినిమాతో సౌత్ లో వరుస ఆఫర్లను అందుకుంటు బిజీ అవుతుంది. ఇక ప్రస్తుతం శ్రీయా రెడ్డి.. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
సలార్ సినిమాలో ఆమెను చూసిన తర్వాత ప్రేక్షకులంతా పవన్ కళ్యాణ్ ఓజీలో ఈమె పెర్ఫార్మన్స్ ఎలా ఉండబోతుందో అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రీయ రెడ్డి ఓజి గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకుంది. తను ఓజిలో నటిస్తున్నది విలన్ రోల్ కాదని.. నెగిటివ్ రోల్ కాదని చెప్పుకొచ్చింది. నా పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయని వివరించింది.
సుజిత్ అద్భుతమైన కథను రూపొందించాడని.. ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ కాయమంటూ శ్రియ రెడ్డి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే శ్రీయ రెడ్డి అందానికి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా శ్రీయ రెడ్డి సగసులతో ఫ్యాన్స్ కు కనులవిందు చేసింది. గోల్డ్ కలర్ టైట్ ఫిట్ డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులిస్తూ కుర్రాళ్ళు మతిపోకూడుతుంది. డస్కి అందాలు ఆరబోస్తు.. మ్యాజిక్ చేసింది. ప్రస్తుతం ఈమె పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.