ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్న సినిమా ఒకటే. అదే హనుమాన్. తేజ సజ్జా హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో స్టార్ హీరోల సినిమాలకు పోటీగా భారీ బడ్జెట్ సినిమాలకు ఎదురేళుతు వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్ నెలకొంది. ఇక ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో రకాల న్యూస్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎన్నో ప్రశ్నలు, సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. వీటన్నిటికీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చేశారు.
ఈ సినిమాపై ఎంతో మంది కుట్రలు చేస్తున్నారు, సినిమాకు అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి, సెన్సార్ విషయంలో కూడా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించారు అయినా భయపడేది లేదు అనుకున్న రోజే హనుమాన్ ప్రేక్షకుల ముందుకి వస్తాడు అంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు పోటీకి దిగడంతో ఈ సినిమాపై స్ట్రెస్ కూడా అదే రేంజ్ లో ఉంది. ఇక ఈ సినిమాలో హనుమాన్ పాత్రలో మెగాస్టార్ నటించారా అని అడగగా ప్రశాంత్ దీనికోసం మెగాస్టార్ను సంప్రదించగా ఆయనకు కుదరదు అని చెప్పేసారు.. దీంతో ఆయన కళ్ళు వాడుకున్నాం అంటూ వివరించాడు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్కు బాలయ్య అభయమిచ్చేసినట్లు తెలుస్తోంది. అలాగే ప్రభాస్ కూడా సినిమా ప్రమోషన్ లో హాజరు కాబోతున్నారట. వీరిద్దరిలో ఏ ఒక్కరు సినిమా ప్రమోషన్స్ లో హాజరైన సినిమాపై మరింత హైప్ పెరుగుతుంది. ఇక ప్రశాంత్ వర్మ ఈ స్టార్ హీరోలను ప్రమోషన్లో ఏ విధంగా వాడుకుంటాడో చూడాలి. చైల్డ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తేజ సజ్జా ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.. ఈ సినిమాతో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటాడు.. అనే ఆసక్తి ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా నెలకొంది.